Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యుటిలిటీ-స్కేల్ ఎనర్జీ స్టోరేజ్‌లోకి ఓలా ఎలక్ట్రిక్

యుటిలిటీ-స్కేల్ ఎనర్జీ స్టోరేజ్‌లోకి ఓలా ఎలక్ట్రిక్

వార్త 9 hrs ago

OLA : భారతీయ ఈవీ దిగ్గజం ఓలా ఎలక్ట్రిక్ మోబిలిటీ లిమిటెడ్, ఎనర్జీ స్టోరేజ్ రంగంలోకి అడుగుపెడుతూ యాక్సిస్ ఎనర్జీతో కీలక అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది.

వాణిజ్య, పారిశ్రామిక (C&I) మరియు యుటిలిటీ-స్థాయి అవసరాల కోసం ఓలా ఆగస్టు 15న అధికారికంగా ప్రారంభించనున్న 'మహాశక్తి' ఎనర్జీ స్టోరేజ్ ప్లాట్‌ఫామ్‌కు ఇది మొదటి భారీ స్థాయి భాగస్వామ్యంగా నిలిచింది. ఈ ఒప్పందంలో భాగంగా 2032 నాటికి 20 GWh వరకు సామర్థ్యాన్ని విస్తరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా 2028 నుంచి ప్రతి ఏటా 5 GWh చొప్పున బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌లను (BESS) పెంచే ప్రణాళికను సిద్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్‌లలో దాదాపు 3,750 మెగావాట్లకు పైగా గ్రిడ్ అనుమతులు పొందిన యాక్సిస్ ఎనర్జీ, తమ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు ఓలా స్వదేశీ స్టోరేజ్ పరిజ్ఞానాన్ని ఉపయోగించనుంది.

స్వదేశీ పరిజ్ఞానం - 400+ GWh లక్ష్యాల దిశగా అడుగులు

సెల్ టెక్నాలజీ, తయారీ మరియు సిస్టమ్ ఇంజినీరింగ్ వంటి కీలక విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చే 'వర్టికల్లీ ఇంటిగ్రేటెడ్ సెల్-టు-సిస్టమ్ ప్లాట్‌ఫామ్' విధానంతో ఓలా ఈ సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఇది వినియోగదారులకు అధిక భద్రత, సరఫరా భద్రత మరియు అతి తక్కువ నిర్వహణ వ్యయాన్ని (TCO) అందిస్తుంది. భారతదేశంలో 2032 నాటికి 400+ GWh కంటే ఎక్కువ శక్తి నిల్వ అవసరం అవుతుందని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (CEA) అంచనా వేసిన నేపథ్యంలో, ఈ భాగస్వామ్యం భారత ఇంధన రంగ పరివర్తనకు ఎంతగానో దోహదపడనుంది. ఓలా సీఎమ్‌డీ భవిష్ అగర్వాల్ మరియు యాక్సిస్ ఎనర్జీ సీఎమ్‌డీ రవి కుమార్ రెడ్డి ఈ భాగస్వామ్యాన్ని పటిష్టమైన, నిరంతరాయమైన స్వచ్ఛమైన విద్యుత్ అందిచే దిశగా వేసిన ఒక ముఖ్యమైన ముందడుగుగా అభివర్ణించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha