Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Geethu Mohandas: టాక్సిక్ బెంగళూరు స్క్రీనింగ్‌లో గీతూ మోహన్‌దాస్ కన్నీళ్లు - మరో చిత్రానికి రెడీ

Geethu Mohandas: టాక్సిక్ బెంగళూరు స్క్రీనింగ్‌లో గీతూ మోహన్‌దాస్ కన్నీళ్లు - మరో చిత్రానికి రెడీ

Geethu Mohandas in tears at the Toxic Bengaluru

కథానాయకుడు యశ్ నటించిన టాక్సిక్ సినిమా తెలుగు రాష్ట్రాలలో విడుదలైంది. తెలుగులో దాదాపు డిజాస్టర్ సినిమాగా ప్రేక్షకులు తీర్పు ఇచ్చారు.
హాలీవుడ్ స్టయిల్ లో తీసిన సినిమా అయినా కథలో కథనంలో గందరగోళం నెలకొందని తీర్పు ఇచ్చారు. అయితే బెంగుళూరు లో దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ టాక్సిక్ స్క్రీనింగ్‌లో కన్నీళ్లు పెట్టుకున్నారు.

విడుదలైన ఆగస్టు 26న, యశ్, కియారా అద్వానీ, నయనతార, మరియు హుమా ఖురేషి నటించిన తన గ్యాంగ్‌స్టర్ డ్రామా *టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్* యొక్క తొలి ప్రదర్శనకు మోహన్‌దాస్ ఏఎంబీ సినిమాస్‌లో హాజరయ్యారు. స్క్రీనింగ్ సమయంలో కన్నీళ్లు పెట్టుకున్న చారల చొక్కా ధరించిన ఒక అభిమానిని ఆమె గట్టిగా కౌగిలించుకోవడం, భావోద్వేగానికి లోనవడం వీడియోలలో రికార్డ్ అయ్యింది. థియేటర్ బయట సంబరాల మధ్య, ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై విస్తృతంగా పనిచేసిన తర్వాత ఒక హృదయపూర్వక మైలురాయిని చేరుకుంటూ, ఆమె నిర్మాత కేవీఎన్‌తో పాటు ఇతర మద్దతుదారులను కూడా ఆలింగనం చేసుకున్నారు.

అనంతరం సోషల్ మీడియాలో దర్శకురాలు ఓ వీడియోను విడుదలచేసి తదుపరి సినిమా కూడా ఇలానే వుంటుందని చెప్పడం విశేషం. నేను ఒకలా రాస్తాను, మరొకలా చిత్రీకరిస్తాను, వేరొకలా ఎడిట్ చేస్తాను చివరికి సినిమా విడుదలవుతుంది అప్పుడు నాకు సంతోషంగా ఉంటుంది. నేను ఇప్పుడు సంతోషంగా వున్నాను. తర్వాత చేయబోయే సినిమా కూడా నిర్మాతలతో చర్చలు జరిపాను. కథను కూడా చెప్పబోతున్నానంటూ ఆనందంగా వెలిబుచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu