Vijay
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ 'జన నాయగన్' రిలీజ్కు రంగం సిద్ధం అయ్యింది. దర్శకుడు హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా సెన్సార్ బోర్డ్ నుండి అనుమతి పొందనుంది.పూర్తి స్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ముందు నటుడిగా విజయ్ నటించిన చివరి చిత్రం కావడంతో దీనిపై భారీ ఆసక్తి నెలకొంది. వాస్తవానికి ఈ చిత్రాన్ని ఈ ఏడాది జనవరిలో సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, అనుమతి కోసం సెన్సార్ బోర్డ్కు పంపిన ఈ చిత్రాన్ని సినెమాటోగ్రాఫ్ (సర్టిఫికేషన్) రూల్స్లోని రూల్ 24 ప్రకారం 'రివైజింగ్ కమిటీ'కి పంపడంతో విడుదల వాయిదా పడింది.
గత ఏడాది డిసెంబర్లో అనుమతి కోసం సమర్పించిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ఇంకా విడుదల అనుమతిని జారీ చేయలేదు. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన జన నాయగన్ చిత్రంలో విజయ్, బాబీ డియోల్, పూజా హెగ్డే, మమితా బైజు, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించారు.

