Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కోటపై నుంచి కేతన్‌ను ఎవరు నెట్టేశారు... ఆధారాలు లేవంటున్న పోలీసులు

కోటపై నుంచి కేతన్‌ను ఎవరు నెట్టేశారు... ఆధారాలు లేవంటున్న పోలీసులు

హారాష్ట్రలోని పూణె నగరానికి చెందిన రియల్టర్ కేతన్ అగర్వాల్‌ను రాజస్థాన్ రాష్ట్రంలోని లోహగఢ్ కోటపై నుంచి కిందకు ఎవరు నెట్టేశారన్న దానిపై స్పష్టత లేదు.
ఈ కేసులో కేతన్‌ను ఎవరు నెట్టేశారన్న దానిపై ఆధారాలు లేవని కోర్టుకు వెల్లడించారు. అందువల్ల ఈ కేసులో కీలక నిందితురాలైన సియా గోయల్‌కు లై-డిటెక్టర్‌ (పాలిగ్రాఫ్‌) పరీక్ష నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు.

ఇప్పటికే సియా, ఆమె ప్రియుడు చేతన్‌ వాంగ్మూలాలను నమోదు చేసుకొన్నట్లు పోలీసులు వెల్లడించారు. దర్యాప్తు ముందుకు వెళ్లాలంటే పాలిగ్రాఫ్‌ పరీక్ష అవసరమని వెల్లడించారు. దర్యాప్తునకు తాజా ఆధారాలను అందించేందుకు ఈ పరీక్షలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

ఏదైనా కేసులో ప్రాథమిక ఆధారాలు బలహీనంగా ఉన్న సమయంలో దర్యాప్తు బృందాలు పాలిగ్రాఫ్‌ పరీక్షలకు అనుమతి కోరతాయి. వాస్తవానికి వీటి ఫలితాలు కోర్టులో చెల్లవు. కేవలం దర్యాప్తు బృందాలకు సహకరించేందుకే కోర్టులు వీటికి అనుమతి ఇస్తాయి. ఈ కేసులో ఇప్పటికే సియా, చేతన్‌ను లోహగడ్‌ కోట వద్దకు తీసుకెళ్లి సీన్‌ రీక్రియేషన్‌ చేశారు. తాజాగా సహనిందితుడు చేతన్‌ నడకను విశ్లేషించేందుకు గెయిట్‌ అనాలసిస్‌ కూడా చేస్తున్నారు.

కేతన్‌ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకనే.. చేతన్‌తో కలిసి ఈ నేరానికి పాల్పడ్డానని సియా అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. ఆమె ఫోన్ ఎప్పుడూ బిజీ వచ్చేదని, చేతన్‌ పేరును తరచూ ప్రస్తావించేదని కేతన్‌ కుటుంబ సభ్యులు ఆరోపించిన సంగతి తెలిసిందే.

'వారి బంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతోనే మా కుమారుడిని హత్య చేశారు' అని ఈ నెల 23న కేతన్‌ తండ్రి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సియా, చేతన్‌పై కేసు నమోదు చేశారు. గతంలో నిందితులిద్దరూ క్రికెట్ మ్యాచ్‌కు హాజరైన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. సియా సోదరుడి ద్వారానే ఆ ఇద్దరికీ పరిచయం ఏర్పడినట్లు అధికారులు గుర్తించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu