Dailyhunt
నిశ్చితార్థం జరిగిన తర్వాత ప్రేమజంట ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

నిశ్చితార్థం జరిగిన తర్వాత ప్రేమజంట ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

engagement

నిశ్చితార్థం జరిగిన తర్వాత ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రేమించుకున్న ఒక జంట, తమ కుటుంబాల సమ్మతితో నిశ్చితార్థం చేసుకున్నారు.
కానీ నిశ్చితార్థం జరిగిన తర్వాత ఏ కారణం చేతనో ఆ ఇద్దరూ వేర్వేరుగా ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు కోల్పోయారు.

నిశ్చితార్థం అనంతరం, తాను మంచిగా సంపాదించిన తర్వాతే పెళ్లి చేసుకుందామని ఆ యువకుడు ఆ యువతితో చెప్పి, ఉపాధి నిమిత్తం గల్ఫ్‌కు వెళ్లాడు. గల్ఫ్‌కు చేరుకున్న ఆరు నెలల్లోపే, ఆర్థిక సమస్యలను తట్టుకోలేక 22 ఏళ్ల ఆ యువకుడు (మక్కల సాయికుమార్) ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మరణవార్త తెలుసుకున్న అతని ప్రేయసి, 20 ఏళ్ల ఒల్లె శృతి కూడా జగిత్యాల జిల్లా, మల్లాపూర్ మండలం, సిరిపూర్ గ్రామంలో ఆత్మహత్యకు పాల్పడి తన ప్రాణాలను బలి తీసుకుంది.

సాయికుమార్ పాటాదాంరాజుపల్లికి చెందినవాడు. ఏడు నెలల క్రితమే వారి కుటుంబాలు వీరి నిశ్చితార్థాన్ని జరిపించాయి. అయితే, తాను నివసిస్తున్న రేకుల షెడ్డు పట్ల సాయికుమార్ సంతృప్తిగా లేడు. ఒక పక్కా ఇల్లు నిర్మించిన తర్వాతే శృతిని పెళ్లి చేసుకుంటానని ఆమెతో చెప్పాడు.

అందుకనుగుణంగా, అతను బహ్రెయిన్‌కు వెళ్లి దినసరి కూలీగా పనిచేశాడు. మే 1వ తేదీన సాయి మరణవార్త అతని కుటుంబానికి తెలిసింది. సాయి మరణం గురించి తెలుసుకున్న శృతి తీవ్ర మనస్తాపానికి గురై, అదే రోజు ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu