Iran
ఇరాన్ దేశ పౌరులకు ఇజ్రాయెల్ ఓ హెచ్చరిక చేసింది. రైలు ప్రయాణాలకు దూరంగా ఉండాలని కోరింది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కలిసి ఇరాన్పై యుద్ధం చేస్తున్న విషయం తెల్సిందే.అధికారిక పర్షియన్ భాష ఎక్స్ ఖాతాలో ఐడీఎఫ్ ఈ మేరకు పోస్టు పెట్టింది. ఇరాన్ ప్రజలను ఉద్దేశిస్తూ.. 'మీ భద్రత దృష్ట్యా ఇప్పటి నుంచి రాత్రి 9 గంటల వరకు (ఇరాన్ కాలమానం ప్రకారం) దేశవ్యాప్తంగా ఉన్న రైళ్ల మార్గాలకు దూరంగా ఉండండి. రైలు ప్రయాణాలు మానుకోవాలని కోరుతున్నాం. ఒకవేళ మీరు అక్కడ ఉంటే.. అది మీ ప్రాణాలకు ప్రమాదం కావొచ్చు' అని రాసుకొచ్చింది. దీన్ని అత్యవసర హెచ్చరికగా పేర్కొంది. ఏ ఏ ప్రాంతాల్లోని రైల్వే మార్గాలు అనే విషయాన్ని ఇజ్రాయెల్ స్పష్టంగా వెల్లడించలేదు. కాగా.. ఈ హెచ్చరికలపై ఇరాన్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

