పరస్పర అంగీకారంతో భార్యాభర్తల్లా ఒక జంట సహజీవనం సాగిస్తుంటే ఆ అనుబంధంలోని మహిళను వేధింపులకు గురిచేసే పురుషుడిపై ఈ చట్టం కింద చర్యలు తీసుకోవచ్చని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. వివాహితను భర్త లేదా అతని బంధువుల వేధింపుల నుంచి రక్షించేందుకే ఈ సెక్షన్ ఇంతవరకూ పరిమితమైందని, వివాహం లాంటి అనుబంధంలో కొనసాగుతూ ఈ సెక్షన్ కింద నేరాభియోగానికి గురైన వ్యక్తుల అరెస్టుకు సంబంధించి చట్టంలోని నియమాలను ఖచ్చితంగా పాటించాలని పేర్కొంది.
అయితే ఇలాంటి సంబంధంలో ఉన్న పురుషుడినిగానీ, అతని సంబంధీకులనుగానీ ప్రాథమిక విచారణ జరపకుండా అరెస్టు చేయరాదని నిర్దేశించింది. సహజీవనం జీవిత వాస్తవంగా మారిందని, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ ప్రవృత్తి అధికంగా కనిపిస్తోందని, ఇలాంటి బంధంలో ఉన్న వ్యక్తులకు చట్టం వర్తించాలని ధర్మాసనం అభిప్రాయపడింది.

