Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సెయూటాకు వలసదారులు.. తొక్కిసలాట 67మంది మృతి.. ఈదుకుంటూ వచ్చేస్తున్నారు..

సెయూటాకు వలసదారులు.. తొక్కిసలాట 67మంది మృతి.. ఈదుకుంటూ వచ్చేస్తున్నారు..

Ceuta

స్పెయిన్‌లోని సెయూటాకు వేలాది మొరాకో వలసదారులు పోటెత్తడంతో భద్రతా బలగాల చర్యలకు దిగారు. దీంతో 45,000 మంది వెనుదిరిగారు. ఇప్పటికే తొక్కిసలాట, నీట మునిగి 67 మంది వలసదారులు మృతి చెందారు.
దీంతో ఆఫ్రికా-యూరప్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సెయూటా సరిహద్దుకు పోటెత్తిన వలసదారులను నిలువరించేందుకు స్పెయిన్ భద్రతా దళాలు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. గుంపును చెదరగొట్టేందుకు బాష్పవాయువు గోళాలు, జల ఫిరంగులను ప్రయోగించడంతో పాటు గాలిలోకి హెచ్చరిక కాల్పులు జరిపారు.

ఈ ఆకస్మిక వలసల వెనుక కొన్ని కీలక కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం మొరాకో రాజు చిన్నపాటి నేరాలకు పాల్పడిన వేలమంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. అలా విడుదలైన వారి అధిక సంఖ్యలో సరిహద్దు వైపు వచ్చారని పలు కథనాలు వెలువడ్డాయి.

ఈ తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. సెయూటాలోని పరిస్థితులు అత్యంత భయానకంగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu