Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
TGSRTC: ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ టికెట్ చెల్లింపులు-11 నెలల్లో రూ. 2.5 కోట్ల ఆదాయం

TGSRTC: ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ టికెట్ చెల్లింపులు-11 నెలల్లో రూ. 2.5 కోట్ల ఆదాయం

TGSRTC

ర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి డిజిటల్ టికెట్ చెల్లింపులను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్సార్టీసీ) కొత్త విధానాలను అమలు చేస్తోంది.
లక్షలాది మంది ప్రయాణికులు యూపీఏ ఆధారిత చెల్లింపులను ఎంచుకుంటుండటంతో భారీ స్థాయిలో డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయి.

టీజీఎస్సార్టీసీ తెలిపిన వివరాల ప్రకారం, కేవలం 11 నెలల వ్యవధిలోనే సంస్థ యూపీఐ లావాదేవీల ద్వారా రూ. 505.95 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అలాగే, రోజువారీ యూపీఐ వసూళ్లు సుమారు రూ. 2,000 నుండి దాదాపు రూ. 2.5 కోట్లకు గణనీయంగా పెరిగాయని, దీనిని బట్టి ప్రయాణికులలో నగదు రహిత చెల్లింపుల పట్ల ఆదరణ పెరుగుతోందని సంస్థ పేర్కొంది.

అధిక పారదర్శకత, వేగవంతమైన సేవలు, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పిస్తూనే, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి కట్టుబడి ఉన్నామని సంస్థ పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా తమ సాంకేతికతను ఆధునీకరించడం మరియు మరింత సమర్థవంతమైన డిజిటల్ సేవలను ప్రవేశపెట్టడం కొనసాగిస్తామని తెలిపింది. యూపీఐ చెల్లింపులలో కనిపిస్తున్న స్థిరమైన పెరుగుదల, సంస్థ చేపట్టిన డిజిటల్ కార్యక్రమాలపై ప్రయాణికులకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని టీజీఎస్సార్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం. రాజశేఖర్ పేర్కొన్నారు.

గతంలో చిల్లర సమస్యల వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడేవారని, అయితే ఇప్పుడు ప్రజా రవాణాలో డిజిటల్ చెల్లింపుల విషయంలో టీజీఎస్సార్టీసీ ఒక ఆదర్శంగా నిలిచిందన్నారు. రాబోయే రోజుల్లో 100 శాతం నగదు రహిత ప్రయాణాన్ని సాధించే దిశగా సంస్థ కృషి చేస్తోందని ఆయన తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu