Datura Flower curry
ఉమ్మెత్త పువ్వులతో కూర ఆరోగ్యానికి చాలా మంచిదని సోషల్ మీడియాలో వచ్చిన వీడియోను చూసి వండుకుని తిన్నారు. అంతే తిన్న కాసేపటికే నలుగురు కుటుంబ సభ్యులు ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన కాకినాడలో చోటుచేసుకుంది.
ఉమ్మెత్త పువ్వులతో కూర చేసుకుని తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నమ్మిన ఒకే కుటుంబానికి చెందిన గంగాభవాని, వీరలక్ష్మి, వీరబ్బు, జయలక్ష్మి అనే నలుగురు... నిన్న ఆ కూర వండుకుని తిన్నారు. తిన్న వెంటనే అస్వస్థతకు గురైన ఆ నలుగురిని స్థానికులు వారిని వెంటనే కాకినాడ జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
అమ్మవారి జాతర కోసం హైదరాబాద్ నుండి సొంత ఊరికి వచ్చిన ఈ కుటుంబం, ఇలాంటి చిన్న పొరపాటుతో ప్రాణాల మీదకు తెచ్చుకోవడం స్థానికులను కలచివేస్తోంది. ఏవైనా ఆరోగ్య చిట్కాలు పాటించే ముందు అవి వాస్తవమో కాదో సరిచూసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

