తాజా వార్తలు
IIIT Exam Postponed: ట్రిపుల్ ఐటీ పరీక్ష వాయిదా

దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో నివర్ తుఫాను పెను ప్రభావం చూపింది. ఆ తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరుసగా మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో నివర్ తుఫాను ప్రభావం కనిపిస్తోంది. తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్లో పలు పరీక్షలకు ఆటంకం తలెత్తింది. దీంతో ప్రతికూల పరిస్థితుల్లో ట్రిపుల్ ఐటీ పరీక్షను నిర్వహించలేమని, పరీక్షను వాయిదా వేస్తూ (IIIT Exams Postponed in AP) నిర్ణయం తీసుకున్నారు.
- Also Read : SBI Recruitment 2020: భారీగా ఉద్యోగాలకు SBI నోటిఫికేషన్
నివర్ తుపాను (Cyclone Nivar) ప్రభావిత జిల్లాల్లో పరీక్ష నిర్వహణకు వాతావరణం అనుకూలించని కారణాలతో ఆంధ్రప్రదేశ్లో రేపు రాష్ట్ర వ్యాప్తంగా జరగాల్సిన ట్రిపుల్ ఐటీ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఆర్జీయూకేటీ కన్వీనర్ హరినారాయణ ఓ ప్రకటనలో వెల్లడించారు. ట్రిపుల్ ఐటీ పరీక్షను డిసెంబర్ 5వ తేదీన నిర్వహించేందుకు షెడ్యూల్ చేసినట్లు తెలిపారు.
Also Read : CBSE Scholarship 2020: ఇలా చేస్తే ఆ విద్యార్థులకు ప్రతినెలా డబ్బులు!
అభ్యర్థులు పరీక్షపై ఏ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కన్వీనర్ సూచించారు. అదే పరీక్షా కేంద్రాలలో, అభ్యర్థులు ఇదివరకే డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లతో డిసెంబర్ 5వ తేదీన పరీక్షకు హాజరు కావొచ్చునని స్పష్టం చేశారు. అయితే ఏదైనా ఒక గుర్తింపు కార్డుతో రెండు గంటలు ముందుగానే పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చేరుకోవాలన్నారు.
-
Also Read : Oppo Price Cut on Smartphones: ఆకర్షణీయమైన ధరలకే ఒప్పో స్మార్ట్ఫోన్లు
- మా సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
related stories
-
శ్రీకాకుళం ఐసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం
-
కెరీర్ గైడెన్స్ ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే..నీట్ ఏడాదికి రెండుసార్లు?!
-
కెరీర్ గైడెన్స్ ఇప్పటి వరకూ ఆఫ్లైన్లో.. ఆన్లైన్ పరీక్షకు డిమాండ్..