Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నిరూపిస్తే రాజీనామా చేస్తా.. BJLP నేత ఏలేటికి మంత్రి ఉత్తమ్‌ బహిరంగ సవాల్

నిరూపిస్తే రాజీనామా చేస్తా.. BJLP నేత ఏలేటికి మంత్రి ఉత్తమ్‌ బహిరంగ సవాల్

హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ శాసనసభలో కాళేశ్వరం ప్రాజెక్టు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నివేదికపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత (BJLP) ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది.

పరస్పర సవాళ్లతో సభ వేడెక్కింది.

ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యలు: నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) ఇచ్చిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని ఏలేటి ఆరోపించారు. కాళేశ్వరం పునరుద్ధరణ, తదుపరి చర్యలపై ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

మంత్రి ఉత్తమ్ కౌంటర్: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపణలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. "NDSA నివేదికలో అసలు ఏముందో ఏలేటికి తెలుసా?" అని ప్రశ్నించారు. ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మార్గదర్శకాలు, నివేదిక ప్రకారమే కచ్చితంగా ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు.

ఉత్తమ్ రాజీనామా సవాల్: మహేశ్వర్‌రెడ్డి చెబుతున్నట్లుగా NDSA నివేదిక ఇచ్చినట్లు నిరూపిస్తే తాను తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ వేదికగా బహిరంగ సవాల్ విసిరారు.

సవాల్ స్వీకరించిన ఏలేటి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విసిరిన సవాల్‌ను తాము స్వీకరిస్తున్నామని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రకటించారు. మంత్రి చేసే ఏ సవాల్‌కైనా, చర్చకైనా తాము సిద్ధంగా ఉన్నామని ప్రతిసవాల్ విసిరారు. ఈ వివాదంతో కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ, NDSA నివేదిక అంశంపై అసెంబ్లీలో కాంగ్రెస్ - బీజేపీ మధ్య రాజకీయ అగ్గి రాజుకుంది.

ఈ వార్తలను చదవండి:

ఒకటి కాదు, రెండు కాదు.. గంటలో 106 సమోసాలు.. వీడియో వైరల్

బంగారం అమ్మేసి భార్యకు ఐఫోన్ 18 ప్రో గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధమైన భర్త!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy