Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాకెట్ ల్యాబ్ పేరుతో ఘరానా మోసం.. బాధితులకు భారీగా టోకరా

రాకెట్ ల్యాబ్ పేరుతో ఘరానా మోసం.. బాధితులకు భారీగా టోకరా

ల్నాడు జిల్లా, మే 18 (ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లాలో రాకెట్ ల్యాబ్ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. తక్కువ మొత్తంలో డబ్బులు పెట్టుబడి పెడితే భవిష్యత్తులో విడతల వారీగా రూ.25 కోట్ల వరకు వస్తాయని నమ్మబలికి వందలాది మంది నుంచి డబ్బులు వసూలు చేసిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది.

ముఖ్యంగా నరసరావుపేట, చిలకలూరిపేట ప్రాంతాల్లో ఈ మోసం పెద్ద ఎత్తున జరిగింది. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అత్యాశకు పోయి మోసపోయిన బాధితులు..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రూ.3వేల నుంచి రూ.11 వేలు కడితే విడతల వారీగా రూ.25 కోట్లు వస్తాయని కేటుగాళ్లు బురిడీ కొట్టించారు. అత్యాశకుపోయి డబ్బులు కట్టి పలువురు బాధితులు మోసపోయారు. నరసరావుపేటలో 263 మంది సహా చిలకలూరిపేట మరికొందరు.. ఇలా మొత్తం సుమారు 500 మంది నుంచి కేటుగాళ్లు డబ్బులు వసూలు చేశారు. ప్రధాన నిందితుడు చిలకలూరిపేట మండలం గొట్టిపాడుకి చెందిన వెంకట్రావుతో సహా ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసుల చర్యలు..

కేసానుపల్లి వీఆర్వో ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్‌లో నిందితులపై కేసు నమోదైంది. నాగండ్ల వెంకట్రావు, అతని కుమారుడు వంశీ, భార్య, పీఏ నీరజలపై కూడా కేసు నమోదైంది. వీరు పలు ప్రాంతాల్లో కార్యాలయాలు ఓపెన్ చేసి మరీ దందా కొనసాగించినట్లు పోలీసులు తెలిపారు. నరసరావుపేట, చిలకలూరిపేటలో నిందితులపై కేసులు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy