Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రోడ్డు ప్రమాదాల కేసుల్లో 21 రోజుల్లో మరణాల నమోదు

రోడ్డు ప్రమాదాల కేసుల్లో 21 రోజుల్లో మరణాల నమోదు

ఆరోగ్య శాఖ కార్యదర్శి ఆదేశం

మరావతి, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాలు, మెడికో-లీగల్‌ మరణాల కేసుల్లో మృతుల వివరాల నమోదు ప్రక్రియ 21 రోజుల్లో జరగాలని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

ఈ మేరకు హెల్త్‌ సెక్రటరీ వీరపాండియన్‌ అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు ప్రమాదాలు, ఇతర మెడికో-లీగల్‌ కేసుల్లో సంభవించే మరణాలకు సంబంధించిన వివరాలను.. సంబంధిత జనన, మరణాల రిజిస్ట్రార్లకు సకాలంలో చేరడం లేదని తెలిపారు. ఇకపై అలా జరగరాదని స్పష్టం చేశారు. అదేసమయంలో ఈ మరణాల వివరాలను నిర్ణీత విధానంలో సకాలంలో నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీకి గతంలో ఆయన లేఖ రాశారు. దీనికి అనుగుణంగా డీపీజీ కార్యాలయం ఈ నెల 25న రాష్ట్రంలోని పోలీస్‌ కమిషనరేట్లు, ఎస్పీలకు సర్క్యులర్‌ జారీ చేసింది. మరణాల వివరాలను చట్టం, నిబంధనల ప్రకారం నిర్ణీత ఫారం-11లో నమోదు చేసి, సంబంధిత రిజిస్ట్రార్లకు నివేదించాలని పోలీసు అధికారులకు సూచించింది. డీజీపీ కార్యాలయం విడుదల చేసిన సర్క్యులర్‌తో పాటు ఆరోగ్యశాఖ నిబంధనల ప్రకారం అధికారులు చర్యలు తీసుకోవాలని వీరపాండియన్‌ ఆదేశించారు.

సింహాద్రి అప్పన్న ఆలయంలో ముగ్గురు ఉద్యోగుల సస్పెండ్‌

గత ప్రభుత్వానికి నరకడం తప్ప.. నాటే ఆలోచనే రాలేదు: నాగబాబు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy