నేటి మ్యాచ్
కోల్కతా X ముంబై
వేదిక: కోల్కతా, రా.7.30
38 బంతుల్లో 93
రాజస్థాన్కు కీలక విజయం
మార్ష్ పోరాటం వృథా
జైపూర్: వరుసగా మూడు ఓటములతో ప్లేఆఫ్స్ బెర్త్ ప్రమాదంలో పడిన వేళ..
రాజస్థాన్ రాయల్స్ అదరగొట్టింది. టీనేజి సంచలనం వైభవ్ సూర్యవంశీ (38 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్సర్లతో 93) సొంత మైదానంలో పిడుగల్లే విరుచుకుపడ్డాడు. దీంతో మంగళవారం లఖ్నవూ సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ 7 వికెట్లతో విజయం సాధించింది. ప్రస్తుతం 14 పాయింట్లతో నాలుగో స్థానానికి చేరిన రాజస్థాన్ ఆఖరి మ్యాచ్లోనూ గెలిస్తే నేరుగా ప్లేఆ్ఫ్సకు వెళ్తుంది. మ్యాచ్లో ముందుగా లఖ్నవూ 20 ఓవర్లలో 5 వికెట్లకు 220 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (57 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 96), ఇన్గ్లి్స (29 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 60), కెప్టెన్ రిషభ్ పంత్ (23 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 35) ధాటిగా ఆడారు. ఛేదనలో రాజస్థాన్ 19.1 ఓవర్లలో 3 వికెట్లకు 225 పరుగులు చేసి గెలిచింది. జురెల్ (38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 53 నాటౌట్), జైస్వాల్ (23 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్తో 43) రాణించారు. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా వైభవ్ నిలిచాడు.
బాదుడే బాదుడు: భారీ ఛేదనను రాజస్థాన్ ఆత్మవిశ్వాసంతో ఆరంభించింది. ఓపెనర్ జైస్వాల్ దూకుడును మరో ఓపెనర్ వైభవ్ తుఫాన్గా మార్చాడు. బంతి పడిందే ఆలస్యం అన్నట్టుగా సిక్సర్ల వర్షం కురిపించాడు. తొలి ఓవర్లోనే జైస్వాల్ నాలుగు ఫోర్లతో 23 రన్స్, నాలుగో ఓవర్లో 6,4,4,4తో 19 రన్స్ రాబట్టాడు. అటు ఆరంభంలో నెమ్మదిగా ఆడిన వైభవ్ ఆరో ఓవర్లో 6,4,4తో పవర్ప్లేలో జట్టు 71 పరుగులకు చేరింది. ఆ వెంటనే జైస్వాల్ వెనుదిరగగా, వైభవ్ లఖ్నవూ బౌలర్లను బెంబేలెత్తించాడు. పేసర్ ఆకాశ్ ఓవర్లో 6,4,4,6,2తో 26 రన్స్ అందించిన వైభవ్ 23 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. అటు జురెల్ 12వ ఓవర్లో 4,6,6, వైభవ్ 6,6లతో ఏకంగా 29 రన్స్ సమకూరాయి. వైభవ్ 93 రన్స్ దగ్గర భారీషాట్కు వెళ్లి వెనుదిరగడంతో, రెండో వికెట్కు 105 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అనంతరం ప్రిటోరియస్ (7) రనౌటైనా.. జురెల్ అర్ధసెంచరీ సాధించడంతో పాటు ఫెరీరా (16 నాటౌట్) సహకారంతో ఐదు బంతులుండగానే మ్యాచ్ను ముగించాడు.

ఓపెనర్ల దూకుడు: టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన లఖ్నవూకు ఓపెనర్లు మార్ష్, ఇన్గ్లి్స మెరుపు ఆరంభాన్ని అందించారు. రాజస్థాన్ బౌలర్లకు ఈ జోడీ ఎలాంటి అవకాశాన్ని ఇవ్వకుండా పరుగుల వరద పారించింది. ఓ దశలో 250 స్కోరు కూడా సాధ్యమే అనిపించినా.. డెత్ ఓవర్లలో పుంజుకున్న రాజస్థాన్ బౌలర్లు లఖ్నవూ ఆశించిన స్కోరును చేయకుండా అడ్డుకోగలిగారు. తొలి ఓవర్లో మార్ష్ 4,6తో జోరు చూపగా.. ఆ తర్వాత ఇన్గ్లి్స ఎక్కువగా స్ట్రయికింగ్ తీసుకుని చెలరేగాడు. నాలుగో ఓవర్లో 4,4,6తో 16 రన్స్ అందించాడు. దీంతో అతి తక్కువ బంతుల్లోనే (21) లఖ్నవూ తమ 50 రన్స్ను సాధించింది. ఇక ఐదో ఓవర్లో మార్ష్ 4,4,6.. ఆరో ఓవర్లో ఇన్గ్లి్స 6,4 బాదడంతో పవర్ప్లేలో జట్టు 83 పరుగులతో పటిష్టంగా నిలిచింది. ఆ తర్వాత 23 బంతుల్లోనే ఫిఫ్టీని పూర్తి చేసిన ఇన్గ్లిస్ను స్పిన్నర్ యష్రాజ్ బౌల్డ్ చేశాడు. అప్పటికే తొలి వికెట్కు 49 బంతుల్లోనే 109 పరుగుల భాగస్వామ్యం జత చేరింది. ఈ దశలో మార్ష్ బ్యాట్ ఝుళిపించాడు. అటు పూరన్ (16)ను కూడా యష్రాజ్ అవుట్ చేశాడు. పంత్ రాకతో 13-15 ఓవర్ల మధ్య 16 పరుగులే వచ్చాయి. ఆ తర్వాత ఇద్దరూ వేగం చూపి బౌండరీలు రాబట్టడంతో 18వ ఓవర్లో స్కోరు 200 దాటింది. ఆఖరి ఓవర్లో ఆర్చర్ ఐదు పరుగులే ఇచ్చి బదోని (0)ని బౌల్డ్ చేయగా.. పంత్, సెంచరీ ముంగిట మార్ష్ రనౌటయ్యారు.
స్కోరుబోర్డు
లఖ్నవూ: మార్ష్ (రనౌట్) 96, ఇన్గ్లిస్ (బి) యష్రాజ్ 60, పూరన్ (సి) ఫెరీరా (బి) యష్రాజ్ 16, పంత్ (రనౌట్) 35, సమద్ (నాటౌట్) 0, బదోని (బి) ఆర్చర్ 0, ఎక్స్ట్రాలు: 13; మొత్తం: 20 ఓవర్లలో 220/5; వికెట్ల పతనం: 1-109, 2-151, 3-215, 4-220, 5-220; బౌలింగ్: ఆర్చర్ 4-0-39-1, సుశాంత్ 4-0-46-0, సందీప్ 3-0-43-0, బ్రిజేశ్ 4-0-44-0, యష్రాజ్ 4-0-35-2, షనక 1-0-10-0.
రాజస్థాన్: జైస్వాల్ (సి) పంత్ (బి) ఆకాశ్ 43, వైభవ్ సూర్యవంశీ (సి) సమద్ (బి) మొహిసిన్ 93, జురెల్ (నాటౌట్) 53, ప్రిటోరియస్ (రనౌట్) 7, ఫెరీరా (నాటౌట్) 16, ఎక్స్ట్రాలు: 13; మొత్తం: 19.1 ఓవర్లలో 225/3; వికెట్ల పతనం: 1-75, 2-180, 3-196; బౌలింగ్: ఆకాశ్ 3-0-54-1, మొహిసిన్ 4-0-31-1, మయాంక్ 4-0-50-0, ప్రిన్స్ 4-0-43-0, దిగ్వేశ్ 4-0-38-0, షాబాజ్ 0.1-0-6-0.
1
ఓ ఐపీఎల్ సీజన్లో 500 పరుగులు సాధించిన పిన్నవయస్కుడిగా (15 ఏళ్లు) వైభవ్. గతంలో పంత్ (2018లో) పేరిట ఈ రికార్డు ఉండేది. అలాగే పవర్ప్లేలోనే ఎక్కువ పరుగులు (426) సాధించిన రెండో బ్యాటర్గా వైభవ్. వార్నర్ (2016లో 467) ముందున్నాడు.
2
ఒకే మ్యాచ్లో 10+ సిక్సర్ల చొప్పున బాదడం వైభవ్కిది మూడోసారి. గేల్ (4) ముందున్నాడు.
ప్రభాకరన్కు విజయ్ నివాళి.. రాజీవ్ గాంధీ హత్యను గుర్తుచేసిన బీజేపీ..
బీజేపీ బెదిరింపులతోనే పోటీ నుంచి తప్పుకున్న జహంగీర్ ఖాన్.. టీఎంసీ ఫైర్

