Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
2 వేల మందికి పైగా పోలీసులతో మోదీ సభకు కట్టుదిట్టమైన భద్రత

2 వేల మందికి పైగా పోలీసులతో మోదీ సభకు కట్టుదిట్టమైన భద్రత

వార్త 2 weeks ago

PM Modi Meeting: హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. సుమారు లక్ష మంది జనం వచ్చే అవకాశం ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఏకంగా 2 వేల మందికి పైగా పోలీసు బలగాలతో సభా ప్రాంగణం అంతా నిఘా నీడలోకి వెళ్ళింది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ పక్కాగా అమలు చేస్తున్నారు.

Read also: PM Modi-Pawan Kalyan: రేపు పవన్ నివాసానికి ప్రధాని మోదీ?

 PM Modi Security at Hyderabad Meeting

PM Modi Meeting: కమాండ్ కంట్రోల్ నిఘాలో సభా ప్రాంగణం

సభలో భద్రతను పర్యవేక్షించడానికి జాయింట్ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయడం విశేషం. దీని ద్వారా సభ లోపల, బయట ఏం జరుగుతుందో అధికారులు ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా చూస్తూ పర్యవేక్షిస్తారు. ప్రవేశ ద్వారాల వద్ద అత్యాధునిక స్కానింగ్ యంత్రాలను అమర్చి ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువుల కదలికలపై నిరంతరం నిఘా కొనసాగుతోంది.

ప్రజలు పాటించాల్సిన కఠిన నిబంధనలు

సభకు వచ్చే వారు కొన్ని వస్తువులను తీసుకురావద్దని పోలీసులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా హెల్మెట్లు, లైటర్లు, అగ్గిపెట్టెలు మరియు ఎలక్ట్రానిక్ వస్తువులను సభ లోపలికి అనుమతించడం లేదు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ ఆంక్షలు విధిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. సభ విజయవంతం కావడానికి ప్రజలు పోలీసులకు సహకరించాలని వారు కోరుతున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

మోదీ పర్యటనతో మారుతున్న రాజకీయ సమీకరణాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha