Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆఫ్ఘనిస్తాన్‌లో ఘోర ప్రమాదం..22 మంది మృతి!

ఆఫ్ఘనిస్తాన్‌లో ఘోర ప్రమాదం..22 మంది మృతి!

వార్త 2 weeks ago

Afghan Refugees Truck Crash: పాకిస్తాన్ నుంచి బలవంతంగా తమ స్వదేశానికి తిరిగి వస్తున్న ఆఫ్ఘన్ శరణార్థుల (Afghan Refugees) జీవితాల్లో రోడ్డు ప్రమాదం కోలుకోలేని విషాదాన్ని నింపింది.

శరణార్థులతో ప్రయాణిస్తున్న ఒక భారీ ట్రక్కు ప్రమాదవశాత్తు బోల్తా పడిన ఘటనలో కనీసం 22 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులలో అత్యధికులు మహిళలు, పసిపిల్లలే ఉండటం ఈ ప్రమాద తీవ్రతను మరింత పెంచింది. తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లోని లగ్మన్ ప్రావిన్స్ పరిధిలో ఉన్న కాబూల్-నంగర్‌హర్ ప్రధాన రహదారిపై ఈ ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి

Read Also :Trump Health Report:'అద్భుతమైన ఆరోగ్యంతో' ట్రంప్: శ్వేతసౌధం వైద్య నివేదిక వెల్లడి!

నిద్రమత్తే ప్రాణాలు తీసింది

 Kabul Nangarhar Highway

ప్రాథమిక విచారణ సమాచారం ప్రకారం.. గంటల తరబడి ఏకధాటిగా (నిరంతరంగా) వాహనాన్ని నడిపిన డ్రైవర్ ఒక్కసారిగా నిద్రమత్తులోకి జారుకున్నాడు. దీంతో వేగంగా వెళ్తున్న ట్రక్కు అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న ఒక లోతైన కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో ట్రక్కులో భారీ సంఖ్యలో శరణార్థుల కుటుంబాలు, వారి సామాగ్రి ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

Afghan Refugees Truck Crash:మృతుల్లో 10 మంది చిన్నారులు, 5 గురు మహిళలు

లగ్మన్ ప్రావిన్స్ గవర్నర్ అధికారిక ప్రతినిధి ‘అబ్దుల్ మాలిక్ నియాజాయ్’ వెల్లడించిన వివరాల ప్రకారం. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మరణించిన వారిలో 10 మంది చిన్నారులు, ఐదుగురు మహిళలు ఉన్నారు. గాయపడిన 36 మందిని తక్షణమే నంగర్‌హర్, జలాలాబాద్ ప్రాంతాల్లోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రమాద సమాచారం అందిన వెంటనే ఆఫ్ఘన్ పోలీసులు, అత్యవసర రెస్క్యూ బృందాలు, స్థానిక గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నలిగిపోయిన ట్రక్కు కేబిన్లలో చిక్కుకున్న బాధితులను బయటకు తీసేందుకు రెస్క్యూ టీమ్స్ గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది.

పాకిస్తాన్ కఠిన చట్టాల వల్లే..

ఈ ప్రమాదంలో చిక్కుకున్న వారంతా గత దశాబ్దాలుగా పాకిస్తాన్‌లో నివసిస్తూ, ఇటీవల స్వదేశానికి వస్తున్నవారేనని అధికారులు ధృవీకరించారు. 2023లో అక్రమ వలసదారులపై పాకిస్తాన్ ప్రభుత్వం కఠినమైన చట్టాలు, బహిష్కరణ చర్యలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దశాబ్దాలుగా పాకిస్తాన్‌లో స్థిరపడి జీవనం సాగిస్తున్న లక్షలాది మంది ఆఫ్ఘన్ శరణార్థులు తమ ఆస్తులను వదులుకుని బలవంతంగా స్వదేశానికి తిరిగి రావలసి వస్తోంది. అలా స్వదేశానికి వస్తున్న క్రమంలోనే ఈ రోడ్డు ప్రమాదం వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఆర్థిక మాంద్యానికి చైనా కొత్త ప్లాన్.. సెలవులే ఆయుధం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha