Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఐదుగురు మృతి

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఐదుగురు మృతి

వార్త 1 week ago

Jalpaiguri Bus Accident; పశ్చిమ బెంగాల్‌లోని (West Bengal) జల్పాయ్‌గురి (Jalpaiguri) వద్ద ఆదివారం తెల్లవారుజామున అత్యంత ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఉత్తర బెంగాల్ స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (NBSTC) ఆర్టీసీ బస్సు, రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని అత్యంత వేగంగా వెనుక నుండి ఢీకొట్టడంతో ఈ భారీ విషాదం సంభవించింది.

Read Also:Anantapur Train Accident: పెళ్లికి ఒప్పుకోలేదని రైలు కింద పడి ప్రేమ జంట బలవన్మరణం!

Jalpaiguri Bus Accident:మితిమీరిన వేగమే మృత్యుపాశం - 17 మంది పరిస్థితి విషమం

ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. లారీ చక్రాల కిందకు బస్సు బాడీ దూసుకుపోవడంతో ప్రయాణికులు లోపలే ఇరుక్కుపోయారు.

  • క్షతగాత్రుల వివరాలు: ఈ ప్రమాదంలో మొత్తం 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.
  • మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్: గాయపడిన వారిలో 17 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని జిల్లా ఎస్పీ ఆందోళన వ్యక్తం చేశారు.
  • కారణం: డ్రైవర్ నిద్రమత్తు, బస్సు మితిమీరిన వేగమే (Over Speeding) ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలింది.

Epaper: epaper.vaartha.com

కరీంనగర్ టూ హైదరాబాద్ ఎలక్ట్రిక్ బస్సులో ఘోర అగ్నిప్రమాదం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha