Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెళ్లికి ఒప్పుకోలేదని రైలు కింద పడి ప్రేమ జంట బలవన్మరణం!

పెళ్లికి ఒప్పుకోలేదని రైలు కింద పడి ప్రేమ జంట బలవన్మరణం!

వార్త 1 week ago

Anantapur Train Accident:అనంతపురం జిల్లా రాప్తాడు మండలం గంగులకుంట ప్రాంతంలో రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

స్థానికుల సమాచారం మేరకు పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన చుట్టుపక్కల ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది.

Read also: Parbhani Hanuman Temple Collapse: కూలిన హనుమాన్ ఆలయ మండపం.. శిథిలాలో 30 మంది భక్తులు?

 Young couple commits suicide by jumping in front of a train.

ఆత్మహత్యకు గల కారణాలు

ఈ జంట ప్రాణాలు తీసుకోవడానికి అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు. కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించకపోవడం ఈ నిర్ణయానికి దారితీసిందా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. చుట్టుపక్కల వారిని విచారిస్తూ ఆధారాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను తరలించారు.

Anantapur Train Accident:పోలీసుల విచారణ కొనసాగింపు

ప్రస్తుతం సంఘటనా స్థలంలో పరిస్థితులు అదుపులో ఉన్నాయి. రైల్వే పోలీసులు నిఘా పెంచి ఘటన వివరాలు సేకరిస్తున్నారు. మృతుల వివరాలు సేకరించిన అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించనున్నారు. యువత ఇలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవడం పట్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయి విచారణ తర్వాత మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

Epaper: epaper.vaartha.com

కరీంనగర్ టూ హైదరాబాద్ ఎలక్ట్రిక్ బస్సులో ఘోర అగ్నిప్రమాదం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha