Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆర్జీవీ కొత్త సినిమా.. టీ-సిరీస్ నిర్మాణంలో 'పోలీస్ కంపెనీ'

ఆర్జీవీ కొత్త సినిమా.. టీ-సిరీస్ నిర్మాణంలో 'పోలీస్ కంపెనీ'

వార్త 2 weeks ago

Ram Gopal Varma New Movie: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ టీ-సిరీస్‌తో కలిసి ఆయన 'పోలీస్ కంపెనీ' అనే సినిమాను తెరకెక్కించబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

“ఇట్ ఈజ్ మోర్ డేంజరస్ దేన్ డీ కంపెనీ” (ఇది డీ కంపెనీ కన్నా ప్రమాదకరం) అనే ట్యాగ్‌లైన్‌తో ఈ చిత్రం రాబోతోంది. ఈ చిత్రంలో పవర్‌ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో నటుడు హర్షవర్ధన్ రాణే నటించనున్నారు.

Read Also : Shankar : శంకర్ డైరెక్షన్లో అజిత్ సినిమా?

 RGV’s new movie… ‘Police Company’, produced by T-Series.

Ram Gopal Varma New Movie: ‘పోలీస్ కంపెనీ’ కాన్సెప్ట్ వెనుక కథ

ఈ సినిమా వివరాలను ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పంచుకుంటూ వర్మ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. “పోలీసు అనేది ఒక వ్యవస్థ, అండర్ వరల్డ్ కంపెనీ అనేది డబ్బు సంపాదించే సంస్థ. కానీ, ఒక వ్యవస్థకు అదనపు అధికారాలు ఇచ్చినప్పుడు, అది కూడా ఒక కంపెనీగా మారిపోతుంది” అంటూ తన సినిమా కాన్సెప్ట్‌ను వివరించారు. 1990ల చివరలో, 2000ల ప్రారంభంలో ముంబైలో పెరిగిపోయిన గ్యాంగ్ కార్యకలాపాలను అరికట్టడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీస్ స్క్వాడ్ స్ఫూర్తితో ఈ కథ రాబోతోందని స్పష్టం చేశారు.

సినిమా నేపథ్యాన్ని వివరిస్తూ, దావూద్ ఇబ్రహీం తన ప్రత్యర్థి గ్యాంగ్‌లను అంతమొందించి ‘డీ కంపెనీ’ని స్థాపించి దుబాయ్ పారిపోయాడని ఆర్జీవీ గుర్తుచేశారు. ఆ తర్వాత డీ కంపెనీ కార్యకలాపాలను చోటా రాజన్ చూసుకునేవాడని తెలిపారు. అయితే, వారిద్దరి మధ్య వచ్చిన విభేదాలతో ముంబై అండర్ వరల్డ్‌లో ఒక శూన్యత ఏర్పడిందని, ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుంచి వచ్చిన యువకులతో కొత్త గ్యాంగ్‌లు పుట్టుకొచ్చాయని వర్మ పేర్కొన్నారు.

ఎన్‌కౌంటర్ స్పెషల్ స్క్వాడ్ కథతో…

ఈ అరాచకాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఒక స్పెషల్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేసిందని, ఆ స్క్వాడ్ 1997 నుంచి 2004 మధ్య కాలంలో 300 మందికి పైగా గ్యాంగ్‌స్టర్లను హతమార్చిందని తెలిపారు.

‘పోలీస్ కంపెనీ’ చిత్రం ఆ స్పెషల్ స్క్వాడ్ కథేనని, అందులో కీలక సభ్యుడైన పోలీస్ ఆఫీసర్ దయా నాయక్ పాత్ర స్ఫూర్తితోనే ప్రధాన పాత్రను తీర్చిదిద్దినట్లు వర్మ చెప్పారు. ఈ పాత్రను హర్షవర్ధన్ రాణే పోషిస్తుండగా, చిత్రంలో ఇంకా చాలా మంది ప్రముఖ నటులు ఉన్నారని, వారి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. గతంలో ‘సత్య’, ‘కంపెనీ’ వంటి చిత్రాలతో ముంబై అండర్ వరల్డ్‌ను వెండితెరపై ఆవిష్కరించిన వర్మ, ఇప్పుడు పోలీసుల కోణంలో మరో పవర్‌ఫుల్ కథతో రాబోతుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు పెరిగాయి.

రాహుల్ సిప్లిగంజ్ మోసం చేశాడంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన యువతీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha