అస్సాం రాజకీయాల్లో సంచలనం
Himanta biswa : అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ భార్య రినికి శర్మపై కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. కాంగ్రెస్ నేత పవన్ ఖేరా మాట్లాడుతూ ఆమెకు మూడు వేర్వేరు దేశాల పాస్పోర్టులు ఉన్నాయని, విదేశాల్లో భారీగా ఆస్తులు ఉన్నాయని ఆరోపించారు.
ఈ ఆరోపణలు అస్సాం రాజకీయాల్లో పెద్ద చర్చకు దారి తీశాయి.
విదేశీ పాస్పోర్టులు, భారీ ఆస్తుల ఆరోపణలు
ఒక మీడియా సమావేశంలో పవన్ ఖేరా కొన్ని పత్రాలను విడుదల చేస్తూ రినికి శర్మకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్ట్, ఆంటిగ్వా దేశాల పాస్పోర్టులు ఉన్నాయని తెలిపారు. దుబాయ్లో ఖరీదైన ఆస్తులు ఉన్నాయని, అమెరికాలోని వ్యోమింగ్లో దాదాపు 34 బిలియన్ డాలర్ల బడ్జెట్తో ఒక కంపెనీ నడుపుతున్నారని పేర్కొన్నారు. ఈ ఆస్తుల వివరాలు ఎన్నికల అఫిడవిట్లో ఎందుకు వెల్లడించలేదని కూడా ప్రశ్నించారు.
Read Also:SRH vs LSG match updates: షమీ బౌలింగ్లో అభిషేక్ శర్మ అవుట్!
Himanta biswa సీఎం ఘాటు స్పందన
ఈ ఆరోపణలపై సీఎం హిమంత బిస్వ శర్మ తీవ్రంగా స్పందించారు. ఇవన్నీ పూర్తిగా తప్పుడు ఆరోపణలని, రాజకీయ కక్షతో చేస్తున్న ప్రచారమని అన్నారు. పవన్ ఖేరా చూపించిన పత్రాలు ఫోర్జరీ చేసినవని, వాటిలో అనేక తప్పులు ఉన్నాయని తెలిపారు. తమ కుటుంబంపై తప్పుడు ప్రచారం చేసినందుకు 48 గంటల్లో క్రిమినల్ మరియు సివిల్ పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. అబద్ధాలు ప్రచారం చేసే వారిని జైలుకు పంపిస్తామని కూడా స్పష్టం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

