Singanamala: శింగనమల మండల వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆర్డీఓ కేశవ నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆకస్మిక తనకి చేశారు.ఈ సందర్భంగా ఆయన ఇటీవల శింగనమలఎంపీడీఓ నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మౌనికకు శుభాకాంక్షలు తెలిపారు.
ఎండలు తీవ్రమైనందున మండల వ్యాప్తంగా ఎక్కడ త్రాగునీటి సమస్య రాకుండా చూసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ వేగంగా అమలు చేయాలని. అభివృద్ధి పనులు ఎక్కడ కుంటుపడకుండా పూర్తి అయ్యేలా చూడాలి అన్నారు. ఈసమావేశంలో డిప్యూటీ ఎంపీడీఓ అక్బర్. పరిపాలన అధికారి నాగభూషణ్ రెడ్డి. ఏపీఓ భాగ్యలక్ష్మి. జూనియర్ అసిస్టెంట్ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
Read Also:Kalyandurgam: కళ్యాణదుర్గం తహసిల్దార్ కార్యాలయంలో అటెండర్ లక్ష్మీనరసమ్మ హఠాన్మరణం!
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
కళ్యాణదుర్గంలో రక్తదాన ప్రభంజనం.. ప్రాణదాతలకు రూ. 3 లక్షల ఇన్సూరెన్స్ ఫ్రీ!

