Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అఫ్గాన్‌పై బాంబుల వర్షం.. 11 మంది చిన్నారులు బలి!

అఫ్గాన్‌పై బాంబుల వర్షం.. 11 మంది చిన్నారులు బలి!

వార్త 4 days ago

Pakistan Attacks Afghanistan: సరిహద్దు వివాదాలు, ఉగ్రవాద ఆరోపణలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్, అఫ్గానిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి అత్యంత ప్రమాదకర స్థాయికి (Peaks) చేరాయి.

అఫ్గాన్ సరిహద్దు భూభాగాలపై పాకిస్తాన్ వైమానిక దళం (Pakistan Air Force) అర్ధరాత్రి వేళ ఆకస్మికంగా బాంబుల వర్షం కురిపించింది. ఈ భయానక ఎయిర్ స్ట్రైక్స్‌లో 11 మంది అమాయక చిన్న పిల్లలు సహా మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. దాడులు జరిగిన సమయంలో బాధితులంతా ఇళ్లలో గాఢనిద్రలో ఉండటంతో, ప్రాణాలు రక్షించుకునే అవకాశం కూడా లేకుండా పోయింది.

Read Also :POKలో పాక్ బలగాల కాల్పులు..ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్

 Pakistan Air Force Airstrikes Afghanistan Border Conflict Khost Paktika 11 Children Dead

అర్ధరాత్రి దాడులు - మూడు ప్రావిన్సులే టార్గెట్

అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వ అధికారిక ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ (Zabiullah Mujahid) ఈ దాడులకు సంబంధించిన దారుణ దృశ్యాలను, వివరాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అఫ్గాన్ సరిహద్దుల్లోని ఖోస్ట్ (Khost), కునార్ (Kunar), పక్తికా (Paktika) ప్రాంతాల్లోని సాధారణ పౌరుల నివాస గృహాలను లక్ష్యంగా చేసుకుని పాక్ యుద్ధ విమానాలు బాంబులు కురిపించాయి. ఈ దాడుల్లో 11 మంది చిన్నారులు, ఒక మహిళ, ఒక వృద్ధుడు అక్కడికక్కడే మరణించారు. ముఖ్యంగా ఖోస్ట్ ప్రాంతంలోని స్పెరా జిల్లాలో ఒక ఇల్లు బాంబు ధాటికి పూర్తిగా ధ్వంసమవడంతో.. ఆ ఒక్క చోటే ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది చనిపోవడం స్థానికంగా కలకలం రేపింది. గాయపడిన 14 మందిలోనూ ఎక్కువ శాతం మహిళలు, పిల్లలే ఉన్నారు.

ప్రతీకార దాడులేనా? - పాక్ సైన్యం వ్యూహం

ఈ ఘోర వైమానిక దాడులపై పాకిస్తాన్ రక్షణ శాఖ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ.. దీని వెనుక బలమైన ప్రతీకార కోణం ఉన్నట్లు అంతర్జాతీయ రక్షణ నిపుణులు భావిస్తున్నారు. తమ దేశంలో వరుస పేలుళ్లకు తెగబడుతున్న ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఎ-తాబన్ పాకిస్తాన్ (TTP) మూకలకు అఫ్గానిస్థాన్ తాలిబన్ ప్రభుత్వం ఆశ్రయం ఇస్తోందని, వారి స్థావరాలనే తాము టార్గెట్ చేశామని పాక్ సైన్యం గతంలో పలుమార్లు స్పష్టం చేసింది. సరిగ్గా నిన్ననే పాక్ సరిహద్దు చెక్‌పోస్ట్‌పై ఉగ్రవాదులు జరిపిన మెరుపు దాడిలో ఆరుగురు పాక్ భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే పాక్ యుద్ధ విమానాలు సరిహద్దులు దాటి అఫ్గాన్‌పై విరుచుకుపడటంతో.. ఇది ముమ్మాటికీ ప్రతీకార దాడేనని స్పష్టమవుతోంది.

Pakistan Attacks Afghanistan: చైనా మధ్యవర్తిత్వం ఫెయిల్? - మళ్లీ యుద్ధ మేఘాలు

తమ దేశంలో ఎలాంటి ఉగ్రవాద స్థావరాలు లేవని, పాకిస్తాన్ కావాలనే అఫ్గాన్ సార్వభౌమత్వాన్ని (Sovereignty) దెబ్బతీస్తూ పౌరులను వేటాడుతోందని తాలిబన్ పాలకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. గత ఫిబ్రవరి నెలలో ఇరు దేశాల మధ్య తీవ్రస్థాయిలో సరిహద్దు యుద్ధం జరిగింది. ఆ సమయంలో అఫ్గాన్‌లోని ప్రధాన నగరాలైన కాబూల్, కాందహార్‌లపై కూడా పాక్ దాడులు చేసింది. ఆ తర్వాత చైనా (China) రాయబార కార్యాలయం మధ్యవర్తిత్వంతో కొద్దిరోజులు శాంతి చర్చలు జరిగి సరిహద్దులు ప్రశాంతంగా మారాయి. అయితే, తాజా దాడులతో ఇరు దేశాల మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన తాజా లెక్కల ప్రకారం.. కేవలం ఈ ఏడాది మొదటి మూడు నెలల్లోనే పాక్-అఫ్గాన్ సరిహద్దు ఘర్షణల వల్ల ఏకంగా 372 మంది అఫ్గాన్ సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోవడం ఇక్కడి భయానక పరిస్థితులకు అద్దం పడుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha