Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి నేటికీ ఏడాది..

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి నేటికీ ఏడాది..

వార్త 2 days ago

Ahmedabad Air India Crash : దేశ చరిత్రలోనే అత్యంత విషాదకరమైన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం జరిగి నేటికి (జూన్ 12) సరిగ్గా ఏడాది పూర్తయింది.

గతేడాది ఇదే రోజున అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి రన్‌వేపై రయ్​న దూసుకెళ్లి, టేకాఫ్ అయిన కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలోనే ఆ విమానం నియంత్రణ కోల్పోయి సమీపంలోని ఒక హాస్టల్ భవనంపై కుప్పకూలింది. రెప్పపాటు కాలంలో ఏం జరుగుతుందో కూడా ఊహించే లోపే విమాన ఇంధన ట్యాంకులు పేలిపోయి, ఆ ప్రాంతమంతా అగ్నిగుండంగా మారింది. ఈ ఘోర దుర్ఘటనలో విమానంలోని ప్రయాణికులు, పైలట్లు, క్యాబిన్ సిబ్బందితో పాటు హాస్టల్‌లో ఉన్న అమాయక విద్యార్థులు కలిపి మొత్తం 275 మందికి పైగా సజీవ దహనమయ్యారు. మరణించిన వారిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉండటం దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

Read Also : మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై మహేష్ కుమార్ గౌడ్ స్పందన

మృత్యుంజయుడు ‘రమేశ్ విశ్వాస్’: ఆ ఒక్క సీటు తెచ్చిన పునర్జన్మ!

మృత్యువు విలయతాండవం చేసిన ఈ భీకర ప్రమాదంలో ఒక అద్భుతం కూడా చోటుచేసుకుంది. 275 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన ఆ శ్మశాన సదృశ్య వాతావరణంలో, విమానంలో 11A సీట్లో కూర్చున్న ‘రమేశ్ విశ్వాస్’ అనే ప్రయాణికుడు ఒక్కడే ప్రాణాలతో బయటపడి మృత్యుంజయుడిగా నిలిచారు. విమానం ముక్కలై మంటల్లో చిక్కుకున్న వేళ ఆయన సురక్షితంగా బయటపడటం వైద్యులను, పరిశోధకులను సైతం ఆశ్చర్యపరిచింది. ఈ ఘోర ప్రమాదం జరిగి ఏడాది గడిచినా, బాధితుల కుటుంబాల్లో నెలకొన్న శోకం, ఆ భయానక దృశ్యాలు నేటికీ గుజరాత్ ప్రజల మదిలో పచ్చిగానే ఉన్నాయి. విమానయాన భద్రతా నిబంధనలపై మరియు ప్రమాదానికి గల సాంకేతిక కారణాలపై దర్యాప్తు సంస్థలు ఇప్పటికీ లోతైన విశ్లేషణలు జరుపుతున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha