Dailyhunt
AI Content: సోషల్ మీడియా సంస్థలకు కేంద్రం షాక్

AI Content: సోషల్ మీడియా సంస్థలకు కేంద్రం షాక్

వార్త 1 month ago

కృత్రిమ మేధ ఆధారంగా రూపొందించే కంటెంట్‌ (AI Content) పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐ టెక్నాలజీ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, దాని దుర్వినియోగాన్ని అరికట్టేందుకు స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది.

ఇకపై ఏఐ ఆధారంగా రూపొందించిన కంటెంట్‌ను సోషల్ మీడియా వేదికలపై ప్రచురించేటప్పుడు తప్పనిసరిగా లేబుల్ లేదా వాటర్ మార్క్ ఉండాలని కేంద్రం ఆదేశించింది.

Manipur Violence: మణిపుర్‌లో మరోసారి అల్లర్లు

ఆటోమేటెడ్ టూల్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలి

ఈ లేబుల్ సాధారణ యూజర్‌కు కూడా సులభంగా గుర్తించేలా ఉండాలని స్పష్టం చేసింది.ఒకసారి మార్క్ చేసి కంటెంట్, మెటా డేటాను తొలగించడం లేదా దానిని కనిపించకుండా చేయడానికి అవకాశం ఉండరాదదని తెలిపింది. చట్టవిరుద్ధమైన, అభ్యంతకరమైన, మోసపూరిత కంటెంట్‌ను నిరోధించేందుకు ఆటోమేటెడ్ టూల్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సోషల్ మీడియా వేదికలకు సూచించింది. ఏఐ కంటెంట్‌ (AI Content) ను దుర్వినియోగం చేస్తే జరిమానాలు, శిక్షల గురించి యూజర్లకు అవగాహన కల్పించాలని పేర్కొంది.

ఏఐ జనరేటెడ్‌ లేదా డీప్‌ఫేక్‌ కంటెంట్‌ను తొలగించేందుకు కేంద్రం సోషల్ మీడియా సంస్థలకు గడువు కూడా విధించింది. ఏఐ కంటెంట్‌కు సంబంధించి ప్రభుత్వం లేదా కోర్టులు ఆదేశాలు జారీ చేసినప్పుడు దాన్ని 3 గంటల్లోనే తొలగించేలా చూడాలని సూచించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏఐ కంటెంట్‌ విపరీతంగా పెరిగిపోతోంది. ఏది ఒరిజినల్? ఏది ఏఐ కంటెంట్‌ ? అనేది గుర్తుపట్టలేనంతంగా మారిపోయింది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఏఐ కంటెంట్‌ను గుర్తించేలా వాటర్‌ మార్క్‌ పెట్టాలని సోషల్ మీడియా సంస్థలకు ఆదేశించింది.

Read hindi news: hindi.vaartha.com

Yash: 'టాక్సిక్' మూవీ నిర్మాతలపై ఎఫ్ఐఆర్ నమోదు?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha