Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అక్షర్ పటేల్‌కు భారీ జరిమానా.. కారణం ఇదే!

అక్షర్ పటేల్‌కు భారీ జరిమానా.. కారణం ఇదే!

వార్త 1 week ago

Delhi Capitals: ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయం సాధించింది. అయితే, ఆ జట్టు కెప్టెన్ అక్షర్ పటేల్‌కు ఐపీఎల్ యాజమాన్యం షాకిచ్చింది.

ఈ మ్యాచ్‌లో నిర్ణీత సమయంలోగా స్లో ఓవర్ రేట్ నమోదు చేసిన కారణంగా అక్షర్ పటేల్‌కు రూ. 12 లక్షల జరిమానా విధించింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో ఢిల్లీ జట్టుకు ఇది తొలి తప్పిదం కావడంతో, ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం కనీస జరిమానాతో సరిపెట్టింది.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ప్రియాన్ష్ ఆర్య, శ్రేయస్ అయ్యర్, సూర్యాన్ష్ షెడ్గేలు మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఢిల్లీ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న పంజాబ్ బ్యాటర్లు, స్టేడియం నలుమూలలా బౌండరీలతో అలరించారు.

Read Also: European T20 Premier League: ద్రవిడ్ జట్టుకు అశ్విన్ కెప్టెన్

 Slow over rate violation: Rs. 12 lakh fine.

Delhi Capitals: ఢిల్లీ అద్భుత పోరాటం: అక్షర్, మిల్లర్ మెరుపు భాగస్వామ్యం

211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేవలం 33 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ అక్షర్ పటేల్ (30 బంతుల్లో 56 పరుగులు) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడగా, అతనికి డేవిడ్ మిల్లర్ (51 పరుగులు) తోడయ్యారు. వీరిద్దరూ కలిసి జట్టును విజయతీరాలకు చేర్చే బాధ్యత తీసుకున్నారు. చివర్లో మాధవ్ తివారీ, అశుతోష్ శర్మ వేగంగా ఆడటంతో 19 ఓవర్లలోనే ఢిల్లీ 216 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో ఢిల్లీ ప్లేఆఫ్ రేసులో నిలవగా, పంజాబ్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

టాప్ ప్లేస్ పై గుజరాత్ - సన్ రైజర్స్ కన్ను

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha