'ఎక్స్' వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపాటు
Chandrababu Naidu: రాష్ట్రానికి ఒకే రాజధాని ఉంటుందని, అది అమరావతి మాత్రమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పారు.
దేశంలోని 50 రాజకీయ పార్టీలలో 49 పార్టీలు అమరావతికి మద్దతు తెలిపాయని, కానీ ఒకే ఒక్క పార్టీ రాష్ట్రానికి ద్రోహం చేస్తోందని ఆయన మండిపడ్డారు. 2047 నాటికి తెలుగు జాతి ప్రపంచంలోనే నంబర్ వన్గా నిలవాలన్నదే తన ఆకాంక్ష అని వెల్లడించారు. పార్లమెంటు చట్టం చేసిన తర్వాత కూడా రాజధానిపై ఇష్టానుసారం మాట్లాడటం సరికాదని ఆయన హితవు పలికారు.
Read also: Leander Paes: టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్కు 'X' కేటగిరీ భద్రత

The Sole Capital - Chandrababu Clarifies
Chandrababu Naidu: మెగా సిటీలుగా అమరావతి, విశాఖ, తిరుపతి
రాష్ట్రంలోని అమరావతి, విశాఖపట్నం , తిరుపతి నగరాలను మెగా సిటీలుగా మారుస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి రూ.21 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. కేవలం నాలుగు కార్యాలయ భవనాలు నిర్మిస్తే అది రాజధాని అనిపించుకోదని, తొమ్మిది నగరాల కలయికగా అమరావతిని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. హంద్రీనీవా కాలువ ద్వారా చివరి భూములకు నీరందిస్తామని, ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా మారుస్తామని హామీ ఇచ్చారు.
అత్యాధునిక ప్రణాళికతో బ్లూ-గ్రీన్ సిటీ
అమరావతిని బ్లూ అండ్ గ్రీన్ సిటీగా, అత్యాధునిక సాంకేతికతతో నిర్మిస్తున్నామని చంద్రబాబు వివరించారు. రహదారులు, విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేక డక్ట్లు మరియు క్లీన్-గ్రీన్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో 1,307 ఎకరాలను 113 సంస్థలకు కేటాయించినట్లు వెల్లడించారు. అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొంది, రాష్ట్రపతి వద్దకు వెళ్లడం చూసి కొందరు ఓర్వలేక కుట్రలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి

