అమెరికా నావికాదళం పహారా కాస్తున్నప్పటికీ, ఇరాన్కు చెందిన ఒక భారీ సూపర్ ట్యాంకర్ అత్యంత చాకచక్యంగా తప్పించుకుంది. మార్చి నెలలో ఇరాన్ నుండి బయలుదేరిన ఈ నౌక, 20 లక్షల బ్యారెళ్ల ముడి చమురుతో ఇండోనేషియా వైపు వెళ్ళింది.
రియూ ద్వీప సమూహ మార్గం ద్వారా ప్రయాణించి, అమెరికా నిఘా నేత్రాలకు చిక్కకుండా తన గమ్యాన్ని చేరుకోవడమే కాకుండా, సురక్షితంగా తిరిగి ఇరాన్ జలాల్లోకి ప్రవేశించింది.
Read Also: Iran US peace talks : అమెరికాతో చర్చలకు ఇరాన్ నో
Iran-America War
Iran-America War: అమెరికా – ఇరాన్ మధ్య చర్చలపై సందిగ్ధత
ఇరాన్ అణు ఒప్పందం మరియు వాణిజ్య ఆంక్షల నేపథ్యంలో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. రెండో విడత చర్చల కోసం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, సందిగ్ధత వీడటం లేదు. చర్చలు జరుగుతాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. హర్మూజ్ జలసంధిలో అమెరికా నిర్బంధాన్ని ఎత్తివేస్తేనే చర్చలకు వస్తామని ఇరాన్ స్పష్టం చేస్తోంది. ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించి, చర్చలు సఫలం చేయాలని పాకిస్థాన్ ఏర్పాట్లు చేస్తోంది. ప్రపంచ చమురు రవాణాలో హర్మూజ్ జలసంధి ఒక కీలకమైన మలుపు. ఇక్కడ అమెరికా విధిస్తున్న ఆంక్షల వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోంది. ఒప్పందం కుదిరితేనే వెనక్కి తగ్గుతామని అమెరికా అంటుంటే, ఆంక్షలు తొలగించడమే చర్చలకు మొదటి మెట్టు అని ఇరాన్ పట్టుబడుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

