Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమెరికాలో కారు ప్రమాదంలో గాయపడ్డ మధు యాష్కీ కుటుంబం

అమెరికాలో కారు ప్రమాదంలో గాయపడ్డ మధు యాష్కీ కుటుంబం

వార్త 1 week ago

Madhu Yashki : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ కుటుంబం అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంతో ఆందోళనకు గురైంది. ఆయన సతీమణి సుచి యాష్కీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికాగా, ఆమెకు గాయాలైనట్లు సమాచారం.

ప్రస్తుతం అమెరికాలోనే వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది.

బోస్టన్ నుంచి న్యూయార్క్ వెళ్తుండగా ప్రమాదం

మధు యాష్కీ దంపతులు తమ కుమార్తె గగనను ఎండీ కోర్సులో చేర్పించేందుకు అమెరికా వెళ్లారు. బోస్టన్‌లోని కళాశాలలో అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత న్యూయార్క్‌కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా కారు అదుపుతప్పి రోడ్డుపై స్కిడ్ అయి పల్టీలు కొట్టినట్లు సమాచారం.

సుచి యాష్కీకి గాయాలు

ఈ ప్రమాదంలో సుచి యాష్కీకి పక్కటెముకలు విరిగినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ప్రమాదం జరిగిన వెంటనే ఆమెను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్యులు ఆమె ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిసింది.

Read also: Italy earthquake: ఇటలీలో భారీ భూకంపం.. 6.1 తీవ్రతతో ప్రకంపనలు

 Madhu Yashki

వేర్వేరు కార్లలో ప్రయాణం

లగేజీ ఎక్కువగా ఉండటంతో మధు యాష్కీ, సుచి యాష్కీ వేర్వేరు కార్లలో ప్రయాణించారు. సుచి ప్రయాణిస్తున్న వాహనం మాత్రమే ప్రమాదానికి గురికావడంతో మధు యాష్కీ తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. కుటుంబ సభ్యులు త్వరలోనే భారత్‌కు తిరిగి రావాల్సి ఉండగా ఈ ఘటన జరగడం ఆందోళన కలిగిస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. మొజ్తబాతో భేటీకి సిద్ధం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha