Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Andhra Pradesh politics: ఎమ్మెల్యేలతో మంత్రి లోకేష్ డిన్నర్ మీటింగ్ లు

Andhra Pradesh politics: ఎమ్మెల్యేలతో మంత్రి లోకేష్ డిన్నర్ మీటింగ్ లు

వార్త 4 months ago

విజయవాడ : పార్టీ బలోపేతం విషయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ (Nara lokesh) వినూత్న పంథా ఎంచుకున్నారు. పార్టీని గ్రౌండ్ లెవల్ నుంచి బలోపేతం చేసేందుకు సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ.. ఎమ్మెల్యేలు, క్యాడర్కు మరింత దగ్గరయ్యేలా డిన్నర్ మీటింగ్ లకు శ్రీకారం చుట్టారు. కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా.. ఆత్మీయ వాతావరణంలో ప్రతి రోజూ ఏడుగురు ఎమ్మెల్యేలతో భోజనం చేస్తూ..వారి మనోగతాలు తెలుసుకుంటున్నారు. ఈ నిర్ణయం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సహాన్ని నింపుతోంది. ఈ సమావేశాల్లో ప్రధానంగా నియోజకవర్గాల అభివృద్ధి, పెండింగ్లో ఉన్న సమస్యలపై ఎమ్మెల్యేలను ఆరా తీస్తున్నారు.

Read also: TTD: స్వామి వారికీ బ్యాటరీ వాహనాలు ఇచ్చి తన ఉదారతను చాటుకున్న భక్తుడు

Minister Lokesh's dinner meetings with MLAs

కేవలం ఆఫీసు గోడల మధ్య కాకుండా, డైనింగ్ టేబుల్ పై సాగే చర్చల వల్ల

నారా లోకేష్. జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తూ, వారి వ్యక్తిగత యోగక్షేమాలతో పాటు స్థానిక పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. సమస్య ఏదైనా ఉంటే వెంటనే పరిష్కరించేలా అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. కేవలం ఆఫీసు గోడల మధ్య కాకుండా, డైనింగ్ టేబుల్పై సాగే చర్చల వల్ల ఎమ్మెల్యేలతో ఎమోషనల్ బాండింగ్ ఏర్పడుతుందని లోకేష్ భావిస్తున్నారు. మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిపై లోకేష్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. అనుభవం లేక కొంతమంది చేస్తున్న చిన్నపాటి పొరపాట్లను సరిదిద్దేందుకు ఈ వేదికను వాడుకుంటున్నారు. వార్నింగ్, గదమాయింపులు కాకుండా.. ఓ ఫ్రెండ్లో, ఓ మెంటార్ పాలనపై అవగాహన కల్పిస్తున్నారు.

యువ ఎమ్మెల్యేలకి మార్గదర్శకత్వం

హైకమాండ్, యువ ఎమ్మెల్యేలకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించి, వారిలో ఆత్మవిశ్వాసం పెంచడం ద్వారా పార్టీకి క్రమశిక్షణ కలిగిన నాయకత్వాన్ని అందించడమే ఈ సమావేశాల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. టెక్నాలజీని వాడుకుంటూ డాష్ బోర్డుల ద్వారా డెవలప్మెంట్ కాదు క్షేత్రస్థాయిలో మమేకమవ్వడం తన శైలి అని లోకేష్ నిరూపిస్తున్నారు. సీనియర్లకు సముచిత గౌరవం ఇస్తూనే, యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్న తీరు పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని కలిగిస్తోంది. ఈ డిన్నర్ మీటింగ్స్ ద్వారా ఆయన వేస్తున్న అడుగులు అటు పార్టీ ఐక్యతను, ఇటు ప్రభుత్వ పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha