Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అంతర్రాష్ట్ర బస్సు దొంగల ముఠా అరెస్ట్!

అంతర్రాష్ట్ర బస్సు దొంగల ముఠా అరెస్ట్!

వార్త 6 days ago

Jadcherla Thief Gang Arrest: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులను భయాందోళనలకు గురిచేస్తూ వరుస చోరీలకు పాల్పడుతున్న హర్యానా రాష్ట్రానికి చెందిన ఒక ప్రమాదకరమైన అంతర్రాష్ట్ర ప్రొఫెషనల్ జేబుదొంగల/బ్యాగు దొంగల ముఠా గుట్టును జడ్చర్ల పోలీసులు రట్టు చేశారు.

ముఠాకు చెందిన ఆరుగురు సభ్యులను అరెస్ట్ చేసినట్లు మహబూబ్‌నగర్ డీఎస్పీ (DSP) వెంకటేశ్వర్లు మంగళవారం (మే 19, 2026) మీడియాకు వెల్లడించారు.

నిందితుల వద్ద నుండి సుమారు రూ. లక్షల విలువైన 10 తులాల బంగారు ఆభరణాలు మరియు నేరాలకు ఉపయోగించిన హర్యానా రిజిస్ట్రేషన్ గల లగ్జరీ కియా కారెన్స్ కారును స్వాధీనం చేసుకున్నారు.

బస్సుల్లో హడావిడి సృష్టించి.. కత్తితో బ్యాగులు కట్ చేస్తూ!

పోలీసుల కథనం ప్రకారం.. హర్యానా రాష్ట్రం భివానీ జిల్లాకు చెందిన సందీప్ (A-1) ఈ ముఠాకు నాయకుడు. ఇతనితో పాటు అశోక్ (A-2), ప్రవీణ్ (A-3), రాజేష్ (A-4), సునీల్ కుమార్ (A-5), మరియు పాత నేరస్థుడైన కారు డ్రైవర్ సచిన్ (A-6) కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. వీరంతా హర్యానా నుండి కియా కారెన్స్ కారులో (నెం: HR16AB6156) తెలంగాణకు వచ్చారు.

రద్దీగా ఉండే బస్సుల్లో ప్రయాణికుల్లా ఎక్కి, ఒంటరిగా ఉండే మహిళలను లేదా చేతిలో బంగారం ఉన్నట్లు అనుమానమున్న బ్యాగులను లక్ష్యంగా చేసుకునేవారు. బస్సు ఎక్కే సమయంలో ప్రయాణికుల మధ్య ఉద్దేశపూర్వకంగా తోపులాట, హడావిడి సృష్టిస్తూ.. ఆ అదను చూసి వెంట తెచ్చుకున్న షార్ప్‌నర్ కత్తితో బ్యాగులను కట్ చేసి లేదా జిప్ తెరిచి క్షణాల వ్యవధిలో బంగారాన్ని దొంగిలించేవారు. బస్సు కదులుతుండగానే అత్యంత చాకచక్యంగా దిగిపోయి, వెనుకనే ఫాలో అవుతున్న తమ కియా కారులో ఎక్కి పరారవ్వడం వీరి నైపుణ్యం.

జడ్చర్ల పరిధిలో వరుస దొంగతనాలు

ఈ ముఠా ఈనెల 7వ తేదీన జడ్చర్ల నేతాజీ చౌరస్తా వద్ద ఒక మహిళ బస్సు ఎక్కుతుండగా ఆమెను బురిడీ కొట్టించి బ్యాగులోని బంగారాన్ని దొంగిలించి కర్నూల్ వైపు పారిపోయింది. అలాగే సోమవారం నాడు జడ్చర్ల బస్ స్టాండ్ వద్ద ఆటోలో వచ్చిన ప్రయాణికులను వెంబడించి, ఫ్లైఓవర్ సమీపంలో బ్యాగ్ కట్ చేసి మళ్లీ బంగారంతో ఉడాయించింది.

Jadcherla Thief Gang Arrest: పోలీసులను చూసి పారిపోతుండగా లొంగిపోయిన ముఠా

మంగళవారం ఉదయం నిందితులు మళ్లీ దొంగతనం చేయడానికి జడ్చర్ల బస్ స్టాండ్ సమీపానికి చేరుకున్నారు. అదే సమయంలో అక్కడ వాహన తనిఖీలు నిర్వహిస్తున్న జడ్చర్ల ఎస్‌.ఐ కె.మల్లేష్ మరియు పోలీస్ సిబ్బంది ఈ అనుమానాస్పద హర్యానా కారును గుర్తించారు. పోలీసులను చూడగానే నిందితులు కారులో పారిపోవడానికి ప్రయత్నించగా, అలర్ట్ అయిన పోలీసులు కారును చుట్టుముట్టి ఆరుగురు అంతర్రాష్ట్ర దొంగలను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న సొత్తు వివరాలు

  • మారుతీ/కియా కారెన్స్ కారు: HR16AB6156
  • బంగారు నెక్లెస్‌లు: 02
  • బంగారు కమ్మలు: 07 జతలు
  • బంగారు లాకెట్లు: 03
  • బంగారు పట్టీలు: 06
  • బంగారు ఉంగరాలు: 03 & ఒక ముక్కు పుడక
  • మొత్తం రికవరీ: సుమారు 10 తులాల బంగారు నగలు.

నిందితులను అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. అత్యంత ప్లాన్డ్ గా వ్యవహరించి ఈ అంతర్రాష్ట్ర ప్రొఫెషనల్ ముఠాను పట్టుకున్న జడ్చర్ల ఇన్స్పెక్టర్ కమలాకర్, ఎస్‌.ఐ కె.మల్లేష్, కానిస్టేబుళ్లు విష్ణుమూర్తి (PC-368), నరసింహరాజు (PC-1233)లను మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి ప్రత్యేకంగా అభినందించి రివార్డులను ప్రకటించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

సిద్దిపేటలో వరుస దొంగల ముఠా గుట్టురట్టు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha