Dailyhunt
AP: రేపటి నుంచి జిల్లాల వారీగా పాసు పుస్తకాల పంపిణీ

AP: రేపటి నుంచి జిల్లాల వారీగా పాసు పుస్తకాల పంపిణీ

వార్త 3 months ago

ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh) రాష్ట్రంలోని రైతులకు కూటమి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రేపటి నుంచి (శుక్రవారం) జిల్లాల వారీగా పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

ప్రతి జిల్లాలో మండలాల వారీగా స్పష్టమైన షెడ్యూల్ విడుదల చేయనుండగా, రైతులు తాము చెందిన మండలంలో నిర్ణీత తేదీన పాసు పుస్తకాలను పొందే అవకాశం కలుగనుంది. ఈ చర్యతో భూ యాజమాన్యంపై రైతులకు మరింత భద్రత కలగనుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.

Read also: Palnadu crime: దారుణం.. రోకలి బండతో కొట్టి చంపిన భర్త

Andhra Pradesh

ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలను రాష్ట్ర మంత్రి అనగాని సత్య ప్రసాద్ మీడియాకు వెల్లడించారు. పట్టాదారు పాసు పుస్తకాలలో ఏవైనా వివరాల లోపాలు ఉంటే, సంబంధిత అధికారులు రైతుల ఇంటికే వచ్చి సరిదిద్దుతారని తెలిపారు. అలాగే భూ సంబంధిత సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు అన్ని జిల్లాల్లో రెవెన్యూ క్లినిక్‌లను విస్తరించనున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయం ద్వారా రైతుల భూ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

District Reorganization: అతిపెద్ద జిల్లాగా కడప అగ్రస్థానం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha