Dailyhunt
Palnadu crime: దారుణం.. రోకలి బండతో కొట్టి చంపిన భర్త

Palnadu crime: దారుణం.. రోకలి బండతో కొట్టి చంపిన భర్త

వార్త 3 months ago

Husband Kills Wife: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు(Palnadu crime) జిల్లా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామంలో కుటుంబ కలహం ప్రాణాంతకంగా మారింది. భార్యపై అనవసర అనుమానాలు పెంచుకున్న భర్త ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

మృతురాలు పుష్ప కాగా, నిందితుడు ఆమె భర్త సాల్మన్ రాజుగా పోలీసులు గుర్తించారు.

Read Also: Obulavaripalle Accident: మహిళ ప్రాణాలు తీసిన పొగ మంచు

దంపతుల మధ్య తరచూ వాగ్వాదాలు

వివాహమైనప్పటి నుంచే పుష్పపై సాల్మన్ రాజు అనుమానం వ్యక్తం చేస్తూ తరచూ గొడవలకు దిగేవాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇదే కారణంగా దంపతుల మధ్య తరచూ వాగ్వాదాలు జరుగుతుండేవని సమాచారం. ఈ క్రమంలో మంగళవారం రాత్రి కూడా ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకోగా, తీవ్ర ఆగ్రహానికి లోనైన సాల్మన్ రాజు ఇంట్లో ఉన్న పచ్చడి బండతో పుష్పపై దాడి చేశాడు.

తీవ్ర గాయాల పాలైన పుష్ప అక్కడికక్కడే రక్తస్రావంతో మృతి(Died) చెందింది. ఘటనను గమనించిన పొరుగువారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం(Postmortem) కోసం తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ సంఘటనతో గ్రామంలో భయభ్రాంతులు నెలకొన్నాయి. అనుమానం పేరుతో జరుగుతున్న కుటుంబ హింస సంఘటనలు పెరుగుతుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Delhi Crime: లిఫ్ట్ ఇచ్చి.. వ్యాన్‌లో అత్యాచారం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha