Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బాలికను హత్య చేసి, రైలులో  తరలించిన ఆటో డ్రైవర్!

బాలికను హత్య చేసి, రైలులో తరలించిన ఆటో డ్రైవర్!

వార్త 1 week ago

Visakhapatnam Crime: విశాఖపట్నం నగరంలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కంచరపాలెం ప్రాంతానికి చెందిన ఓ బాలికను ఆటో డ్రైవర్ అతి దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని ట్రాలీ బ్యాగ్‌లో కుక్కి వేరే రాష్ట్రానికి తరలించిన ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Read Also :BRS Ex MLA Rega Kantha Rao: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై కేసు నమోదు

హత్యకు గల కారణం

  • పెళ్లి నిలదీసిందని కక్ష: నిందితుడైన ఆటో డ్రైవర్ సురేష్‌ను, సదరు బాలిక పెళ్లి చేసుకోవాలని కోరింది.
  • దానితో తనపై ఒత్తిడి తెస్తోందని కక్ష పెంచుకున్న సురేష్, బాలికను పక్కా పథకం ప్రకారం హతమార్చాడు.

బాలికను హత్య చేసిన అనంతరం, ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని ఒక ట్రాలీ బ్యాగ్‌లో ప్యాక్ చేశాడు. ఆ బ్యాగ్‌ను విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి రైలులో ఒడిశాలోని రాయగడ (Rayagada) వరకు తీసుకెళ్లి అక్కడ పడేశాడు.

Visakhapatnam Crime: పోలీసులు నిందితుడిని ఎలా అరెస్ట్ చేశారంటే

బాలిక కనపడకపోవడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితుడి సెల్‌ఫోన్ సిగ్నల్స్ (Cell Phone Signals) మరియు కాల్ డేటా ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పోలీసులు సురేష్‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నిందితుడిపై హత్య మరియు సాక్ష్యాల విధ్వంసం కింద కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.

బొగ్గు గనిలో భారీ పేలుడు.. 32 మంది కార్మికులు దుర్మరణం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha