Dailyhunt
బాన్సువాడలో విషాదం: ఇడ్లీ ఇరుక్కుని బాలింత మృతి

బాన్సువాడలో విషాదం: ఇడ్లీ ఇరుక్కుని బాలింత మృతి

వార్త 1 week ago

Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో శుక్రవారం తీవ్ర విషాదం నెలకొంది. పిట్లం మండలం బండపల్లి గ్రామానికి చెందిన అర్చన (21) అనే యువతి ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరింది.

సుఖ ప్రసవం జరిగి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆమె, కొద్దిసేపటికే మృత్యువాత పడటం స్థానికులను కలచివేసింది.

Read Also: Overdose medicines : పెళ్లికి ముందు విషాదం.. యువకుడి మృతి మిస్టరీ

 Banswada delivery mother death

Banswada: పురిట్లోనే అనాథగా మారిన పసికందు

డెలివరీ అయిన, కొద్దిసేపటి తర్వాత కుటుంబ సభ్యులు ఇడ్లీ తీసుకొచ్చి అర్చనకు తినిపించారు. ఈ క్రమంలో ఇడ్లీ గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక ఇబ్బంది పడింది. వెంటనే డాక్టర్లు ట్రీట్మెంట్ చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో అర్చన చనిపోయింది. చిన్నారి పుట్టిన కొద్దిసేపటికే తల్లి చనిపోవడం కుటుంబంలో విషాదాన్ని నింపింది.డ్డ పుట్టిన కొద్దిసేపటికే తల్లి మరణించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha