బండి భగీరథ్పై నమోదైన పోక్సో (POCSO) కేసులో సైబరాబాద్ పరిధిలోని పేట్బషీరాబాద్ పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. మైనర్ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు, ఘటన జరిగిన సమయంలో భగీరథ్తో పాటు ఉన్న అతని స్నేహితులను ఇవాళ స్టేషన్కు పిలిపించి విచారించారు.
బాధితురాలి కుటుంబంతో రాజీ కోసం ప్రయత్నించిన వారి వివరాలపై కూడా ఆరా తీశారు. అసలు ఆరోజు ఏం జరిగింది అనే కోణంలో వారిని ప్రశ్నించి, కీలక అంశాలపై వారి నుంచి వాంగ్మూలాలను రికార్డు చేసుకున్నారు.
Read Also: Pune Acid Attack: అనుమానంతో భార్యపై భర్త యాసిడ్ పోసి, 15 రోజులు బంధించిన భర్త!
Bandi Bhagirath’s Case
Bandi Bhagirath’s Case: నిందితుడి విచారణ – చర్లపల్లి జైలుకు రిమాండ్
పోలీసులు గత శనివారం రాత్రి నిందితుడు భగీరథ్ను అరెస్టు చేసి, పేట్బషీరాబాద్ స్టేషన్లో దాదాపు రెండు గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. కేసు నమోదైన తర్వాత పరారు కావడానికి గల కారణాలపై ప్రధానంగా ప్రశ్నించారు. విచారణలో తాను ఎలాంటి తప్పూ చేయలేదని భగీరథ్ పోలీసులకు చెప్పినట్లు, కొన్ని ఆధారాలను సమర్పించినట్లు తెలుస్తోంది. అనంతరం బాధితురాలి స్టేట్మెంట్తో నిందితుడి సమాధానాలను పోల్చి చూసిన పోలీసులు, అతనికి వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల ప్రకారం భగీరథ్ను చర్లపల్లి జైలుకు రిమాండ్ నిమిత్తం తరలించారు. ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు అతడిని పోలీస్ కస్టడీకి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ కేసులో సాక్ష్యాధారాల సేకరణకు పోలీసులు సాంకేతిక (Technical) విధానాలను కూడా ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే మొయినాబాద్లోని రెండు ఫామ్హౌస్లతో పాటు, నానక్రాంగూడలోని ఒక సర్వీస్ అపార్ట్మెంట్ను సందర్శించి పోలీసులు పలు కీలక ఆధారాలను సేకరించారు. నిందితులు, సాక్షుల కాల్ డేటా మరియు లొకేషన్ వివరాలను కూడా విశ్లేషిస్తున్నారు. ఈ రకమైన పోక్సో కేసుల్లో బాధితురాలి స్టేట్మెంట్ అత్యంత కీలకమైనది కావడంతో, పోలీసులు నిబంధనల ప్రకారం బీఎన్ఎస్ (BNS) సెక్షన్ 183 కింద మేడ్చల్ కోర్టు న్యాయమూర్తి సమక్షంలో మైనర్ బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ ద్వారా భద్రపరిచారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
కల్యాణ్ రైల్వే స్టేషన్లో దారుణం.. 14 ఏళ్ల బాలికపై అత్యాచారం

