Narsapur Crime: మహిళపై అత్యాచారం చేసి, హత్య చేసినట్టు భావిస్తున్న స్థానికులు. నర్సాపూర్ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో గుర్తుతెలియని ఒక మహిళ శవం లభించింది.
ఈ మహిళా శవం చేతులు కట్టేసి ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతుతున్నాయి. అత్యాచారం చేసి హత్య చేసినట్టు స్థానికులు భావిస్తున్నారు. మృతి చెందిన మహిళ వయసు సుమారు 35 సంవత్సరాలు ఉంటుంది. మృతి చెందిన మహిళ గురువారం రాత్రి సమయంలో అక్కడ ప్రాంతంలో తిరిగినట్లు చూసిన కొందరు స్థానికులు తెలిపారు. ఇప్పటివరకు మహిళకు సంబంధించిన వివరాలు తెలియరాలేవు. పోలీస్ దర్యాప్తులో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎస్సై రంజిత్ కుమార్ రెడ్డి సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు(Narsapur Crime) సేకరించారు.
Epaper: epaper.vaartha.com

