Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బస్టాండ్ వెళ్లే పని లేకుండా ఆర్టీసీ కొత్త సేవలు

బస్టాండ్ వెళ్లే పని లేకుండా ఆర్టీసీ కొత్త సేవలు

వార్త 2 weeks ago

AP bus service:విజయవాడ నగర వాసుల సౌకర్యం కోసం ఆర్టీసీ యాజమాన్యం ఈ వినూత్న సేవను ప్రారంభించింది. కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో కలిసి ప్రయాణించే వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా మారుతుంది.

ఆరుగురు అంతకంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఉంటే ఈ ప్రత్యేక సేవలను పొందవచ్చు. ప్రయాణికులు బస్టాండ్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా బస్సే నేరుగా ఇంటి ముందుకు వస్తుంది. భారీ లగేజీ మోసే బాధ పూర్తిగా తప్పుతుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో ఈ ప్రయోగం మొదలైంది.

Read also: Expansion Of NH-65 : హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం

 RTC shares good news with residents.

నాలుగు గంటల ముందే ఫోన్ చేయాలి

ఈ సదుపాయం పొందాలనుకునే వారు ప్రయాణ సమయానికి నాలుగు గంటల ముందే సంప్రదించాలి. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలలోపు ఫోన్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలి. అందుబాటులో ఉన్న మొబైల్ నంబర్లకు కాల్ చేసి బుకింగ్ చేసుకోవడం చాలా సులభం. ఇంటి నుంచి బస్టాండ్ దూరాన్ని బట్టి అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఎన్టీఆర్ జిల్లా ప్రజా రవాణా అధికారి ఈ వివరాలను అధికారికంగా వెల్లడించారు.

AP bus service:హైకోర్టు మార్గంలో కొత్త బస్సులు

విజయవాడ పీఎన్‌బీఎస్ నుంచి హైకోర్టుకు వెళ్లే బస్సు మార్గంలో మార్పులు చేశారు. సీడ్ యాక్సెస్ రోడ్ మీదుగా బస్సులను మళ్లించడం జరిగింది. ఉండవల్లి సెంటర్ నుంచి పెనుమాక మీదుగా హైకోర్టుకు కొత్త ట్రిప్ ఏర్పాటు చేశారు. ప్రయాణికుల రాకపోకలు సాఫీగా సాగేందుకు అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. రోజూ ప్రయాణించే ఉద్యోగులకు ఈ మార్పులు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.

Epaper: epaper.vaartha.com

పట్టణ ప్రాంతాలలో ఇల్లులేని వారికి తీపికబురు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha