Election Results: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ (BJP) సంచలన ప్రదర్శన చేస్తోంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్కు గట్టి పోటీనిస్తూ ఆధిక్యంలోకి దూసుకెళ్లగా, అస్సాంలో తన పట్టును మరింత సుస్థిరం చేసుకుంటోంది.
తాజా ట్రెండ్స్ ప్రకారం రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ మ్యాజిక్ ఫిగర్ను దాటేసింది.
Read Also : అసలు ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతుందో తెలుసా ?
దీదీ కోటలో కమల దూకుడు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్లో బీజేపీ అనూహ్య రీతిలో ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తం స్థానాల్లో మెజారిటీ మార్కును దాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది.

- BJP: 149 (ఆధిక్యం)
- TMC: 133
- కాంగ్రెస్: 3
- లెఫ్ట్: 3
- ఇతరులు: 2
గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఇక్కడ గణనీయమైన స్థానాలను కైవసం చేసుకునే దిశగా సాగుతుండగా, మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ రెండో స్థానానికి పరిమితమైనట్లు కనిపిస్తోంది.
Election Results: అస్సాం: మళ్ళీ బీజేపీ హవా
ఈశాన్య రాష్ట్రం అస్సాంలో కూడా బీజేపీ తన విజయయాత్రను కొనసాగిస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ కూటమి కంటే బీజేపీ కూటమి స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతోంది.
- BJP: 96 (ఆధిక్యం)
- కాంగ్రెస్: 28
- ఇతరులు: 2
మ్యాజిక్ ఫిగర్కు అవసరమైన స్థానాల కంటే ఎక్కువే సాధిస్తూ, అస్సాంలో మరోసారి కాషాయ జెండా ఎగరవేయడం ఖాయంగా కనిపిస్తోంది. కౌంటింగ్ కొనసాగుతున్న కొద్దీ ఆధిక్యాల సంఖ్యలో స్వల్ప మార్పులు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ క్లీన్ స్వీప్ చేసే దిశగా వెళుతోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :

