Stock market: అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల వల్ల మన దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు విధించడంతో ముడి చమురు ధరలు చుక్కలను తాకాయి.
బ్యారెల్ ధర 120 డాలర్లు దాటడం ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగించింది. దీనివల్ల మార్కెట్ ప్రారంభం నుంచే అమ్మకాల ఒత్తిడి కనిపించింది.
Read also: Stock market: భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. కారణం ఇదే

Stock market: ఇన్వెస్టర్ల సంపద ఆవిరి
మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 582 పాయింట్లు పడిపోగా నిఫ్టీ 24 వేల దిగువకు చేరింది. ఈ భారీ పతనం వల్ల మదుపర్లు దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల మేర నష్టపోయారు. ప్రధానంగా బ్యాంకింగ్ ఐటీ రంగాల షేర్లు ఎక్కువ నష్టాలను చవిచూశాయి. మార్కెట్ ఒడిదుడుకులు ఇన్వెస్టర్లను కలవరపెడుతున్నాయి.
రూపాయి విలువ పతనం
అంతర్జాతీయ పరిణామాల ప్రభావం భారత రూపాయిపై కూడా గట్టిగా పడింది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 94.90 వద్ద ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయింది. విదేశీ పెట్టుబడిదారులు వెనక్కి తగ్గడం మార్కెట్లను మరింత బలహీనపరిచింది. ముడి చమురు ధరలు తగ్గకపోతే మార్కెట్లు కోలుకోవడం కష్టమని నిపుణులు భావిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

