Heavy Rain in Hyderabad : నిన్న సాయంత్రం కురిసిన ఆకస్మిక భారీ వర్షానికి హైదరాబాద్ ఐటీ హబ్ అస్తవ్యస్తమైంది. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే వేళ హైటెక్ సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లో వాన దంచికొట్టింది.
ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపించడంతో వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుపోయారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో టెక్ కంపెనీలు ఫ్లెక్సిబుల్ వర్క్ షిఫ్ట్ల గురించి ఆలోచిస్తున్నాయి. నగరం విస్తరిస్తున్న కొద్దీ మౌలిక సదుపాయాలపై ఒత్తిడి పెరుగుతోందని ఈ ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ఈ భారీ వర్షం నగరవ్యాప్తంగా ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చింది.
Read Also: Heavy Rain In Hyd : నిన్నటి భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన నగరవాసులు
Heavy Rain in Hyderabad
Heavy Rain in Hyderabad : నీటిలో మునిగి ఇద్దరు వ్యక్తులు మృతి?
విద్యుదాఘాతం, నీటిలో మునిగి ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు మీడియా నివేదికలు ధృవీకరించాయి. సైబర్ టవర్స్ పరిసరాల్లో కేవలం రెండు గంటల్లోనే 40 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఖరీదైన రియల్ ఎస్టేట్ జోన్లలో డ్రైనేజీ వ్యవస్థల తీరుపై ఇప్పుడు నీలినీడలు కమ్ముకున్నాయి. కొత్తగా అపార్ట్మెంట్లు కొనేవారు ఆ ప్రాంతంలోని డ్రైనేజీ మ్యాప్లను ఒకసారి చెక్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మౌలిక సదుపాయాల లోపం.. ఐటీ కారిడార్లో ట్రాఫిక్ జామ్ బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద మోకాళ్ల లోతు నీరు చేరడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కేవలం 5 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఏకంగా నాలుగు గంటల సమయం పట్టిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిన్న రాత్రి కురిసిన వర్షానికి పలు జంక్షన్లలో నీరు నిలిచిపోయి వందలాది పెట్రోల్ వాహనాలు మొరాయించాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

