Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భక్తులకు గుడ్ న్యూస్.. రూ. 225 కోట్లతో బాసర దేవాలయం పునర్నిర్మాణం!

భక్తులకు గుడ్ న్యూస్.. రూ. 225 కోట్లతో బాసర దేవాలయం పునర్నిర్మాణం!

వార్త 2 weeks ago

Basara Temple: తెలంగాణ సర్కార్ బాసర సరస్వతి దేవాలయాన్ని అత్యంత వైభవంగా తీర్చిదిద్దుతోంది. ఇందుకోసం ప్రభుత్వం రూ. 225 కోట్లు కేటాయించింది. దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు ఇటీవల పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

రాబోయే వందేళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. కొత్త కలెక్టర్‌తో కలిసి పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

Read also: PM Modi Meeting: 2 వేల మందికి పైగా పోలీసులతో మోదీ సభకు కట్టుదిట్టమైన భద్రత

 Basara Temple architecture plan 2026

Basara Temple: మాస్టర్ ప్లాన్ విశేషాలు ఇవే

ఈ అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా గర్భాలయం, అనివెట్టి మండపాన్ని మరింత విస్తరిస్తున్నారు. ఆలయానికి నాలుగు వైపులా అందమైన రహదారులు, తూర్పున భారీ తోరణాలు నిర్మిస్తారు. భక్తులు బస చేయడానికి వీలుగా అత్యాధునిక కాటేజీలు అందుబాటులోకి రానున్నాయి. కాళికా అమ్మవారి ఆలయాన్ని కూడా అభివృద్ధి చేస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రణాళికలు రూపొందించారు.

విద్యార్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

జ్ఞాన సరస్వతిని దర్శించుకునే విద్యార్థుల కోసం సీఎం ఆదేశాల మేరకు ప్రత్యేక ఓపెన్ ఆడిటోరియం కడుతున్నారు. ఇక్కడ ఆధ్యాత్మిక ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పనులు ప్రారంభమయ్యే సమయంలో భక్తుల కోసం అక్షర శ్రీకారం మండపంలో బాలాలయం ఏర్పాటు చేస్తున్నారు. త్వరలోనే టెండర్ల ప్రక్రియ ముగించి పనులను వేగవంతం చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha