Odisha Balangir Crime: కుటుంబాల్లో చిన్నపాటి కలహాలు ఎంతటి పెద్ద ప్రమాదాలకు దారితీస్తున్నాయో నిరూపించే మరో విషాదకర ఘటన వెలుగుచూసింది. ఒడిశాలోని బలాంగీర్ జిల్లాలో మొబైల్ ఫోన్ కారణంగా జరిగిన భార్యాభర్తల గొడవ ఒకరి ప్రాణం తీసేవరకు వెళ్లింది.
శనివారం జరిగిన ఈ ఘోర ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Read Also: Gurugram Crime : ప్రేయసిని చంపి..ఆపై AI ఇంజనీర్ ఆత్మహత్య
Wife attacks husband’s head with mobile phone.
Odisha Balangir Crime: క్షణికావేశంలో మొబైల్ ఫోన్తో దాడి
పోలీసులు వెల్లడించిన ప్రాథమిక వివరాల ప్రకారం.. బలాంగీర్ జిల్లాలో ఒక దంపతుల మధ్య శనివారం రోజు తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో భార్య క్షణికావేశానికి లోనై తన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్తో భర్త తలపై అత్యంత బలంగా కొట్టింది. ఫోన్ బలంగా తగలడంతో సదరు వ్యక్తి తలకు తీవ్ర గాయమైంది. రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే అతనిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
డిశ్చార్జ్ అయిన కొద్దిసేపటికే మృతి
ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం బాధితుడి పరిస్థితి నిలకడగా ఉండటంతో వైద్యులు అతనిని డిశ్చార్జ్ చేశారు. అయితే, ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే అతని ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. తీవ్రమైన అస్వస్థతకు గురైన ఆ వ్యక్తి కాసేపటికే ప్రాణాలు విడిచాడు. తలపై బలంగా దెబ్బతగలడం వల్ల అంతర్గత రక్తస్రావం (ఇంటర్నల్ బ్లీడింగ్) జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్షకు పంపారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మరణానికి గల ఖచ్చితమైన కారణాలను విశ్లేషించి దర్యాప్తును ముందుకు తీసుకెళ్తామని పోలీసులు తెలిపారు.
Epaper: epaper.vaartha.com
యమునా నదిలో నలుగురు బాలురు గల్లంతు.. ఇద్దరి మృతదేహాలు లభ్యం!

