Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆగస్టు 17 నుంచి విమానాల రాకపోకలు

భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆగస్టు 17 నుంచి విమానాల రాకపోకలు

వార్త 1 week ago

Bhogapuram Airport: విశాఖపట్నం సమీపంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వాణిజ్య కార్యకలాపాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి.

ఆగస్టు 17వ తేదీ నుంచి ఈ ఎయిర్‌పోర్ట్ ద్వారా విమాన సర్వీసులు రాకపోకలు సాగిస్తాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అధికారికంగా ప్రకటించారు.

ఆగస్టు 1న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం

విశాఖ సమీపంలోని భోగాపురంలో రూపుదిద్దుకున్న ఈ నూతన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1వ తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా ప్రారంభించనున్నారు. విశాఖపట్నం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన పల్లా శ్రీనివాసరావు ఈ కీలక తేదీలను వెల్లడించారు.

Bhogapuram Airport: భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు – ఉత్తరాంధ్ర నుంచి రెండు లక్షల మంది హాజరు

ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను అత్యంత విజయవంతం చేసేలా తెలుగుదేశం పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి. ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలకడంతో పాటు, భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభకు ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల నుంచి సుమారు 2 లక్షల మంది ప్రజలు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివస్తారని అంచనా వేస్తున్నట్లు పల్లా శ్రీనివాసరావు తెలిపారు.

ESI డిస్పెన్సరీలలో మందుల తీవ్ర కొరత - రోగుల అవస్థలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha