బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా ఎంపిక:నీతీశ్ కుమార్ రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే బీజేపీ శాసనసభ్యులు సమావే శమయ్యారు. ఈ భేటీలో ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సామ్రాట్ చౌదరిని తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
దీనితో ఆయన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది.
Read Alsp: Bihar New CM : బిహార్లో రాజకీయ మార్పులు
Bihar New CM
Bihar New CM: మరోసారి బీజేపీ ప్రభుత్వం
గతంలో జేడీయూతో కలిసి సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న బీజేపీ, ఇప్పుడు రాష్ట్రంలో తన నేతృత్వంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ పరిణామం బిహార్ రాజకీయాల్లో బీజేపీ పట్టును మరింత బలోపేతం చేసింది. సామ్రాట్ చౌదరి నాయకత్వంలో రాష్ట్రంలో కొత్త మంత్రివర్గం త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయనుంది. సుదీర్ఘ కాలం పాటు బిహార్ రాజకీయాలను శాసించిన నీతీశ్ కుమార్ నిష్క్రమణతో రాష్ట్రంలో ఒక కొత్త శకం ప్రారంభమైంది. విపక్ష కూటమి నుండి విడిపోయి బీజేపీకి మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యేలు మరియు స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో సామ్రాట్ చౌదరి ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

