Bihar incident: బీహార్ రాష్ట్రం పూర్ణియా జిల్లాలో అత్యంత ఘోరమైన విషాదం చోటుచేసుకుంది. మహానంద నది ప్రవాహం నలుగురు అమాయక పిల్లల ప్రాణాలను బలి తీసుకుంది.
ఎప్పుడూ నవ్వులు, ఆటలతో సందడిగా ఉండే ఆ ఇళ్లలో ఇప్పుడు కేవలం గుండెలు పగిలే రోదనలు, నిస్సహాయ తల్లిదండ్రుల వేదనలు మాత్రమే మిగిలాయి.
గోహాస్ గ్రామానికి చెందిన నలుగురు పిల్లలు తమ స్నేహితులతో కలిసి మధ్యాహ్నం సరదాగా స్నానం చేయడానికి మహానంద నదికి వెళ్లారు. నది ఒడ్డున ఆడుకుంటూ నీటిలోకి దిగిన కొద్దిసేపటికే నదిలో స్నానం చేస్తుండగా, ఒక పిల్లవాడు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి లోతైన నీటిలోకి జారిపోయాడు. తన స్నేహితుడు మునిగిపోతుండటం చూసిన మిగతా ముగ్గురు పిల్లలు అతడిని రక్షించేందుకు ఏమాత్రం ఆలోచించకుండా ముందుకు పరుగెత్తారు. భారీ వర్షాల కారణంగా మహానంద నది తీవ్ర ఉధృతితో ప్రవహిస్తోంది. ఆ నీటి ప్రవాహం పిల్లలందరినీ ఒక్కొక్కరిగా లాగేసుకుంది. గట్టుపై ఉన్న కొందరు స్థానికులు పిల్లలను కాపాడటానికి వెంటనే నదిలోకి దూకినప్పటికీ ఫలితం లేదు.
A terrible tragedy in Bihar.. Four children died due to the overflowing of the Mahananda river.
Bihar incident: ఒకరి మృతదేహం లభ్యం.. ముగ్గురి కోసం గాలింపు
గ్రామస్థులు స్వయంగా నదిలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టగా, తీవ్రంగా శ్రమించిన అనంతరం ఒక బాలుడి మృతదేహం లభ్యమైంది. పోలీసులు ఈ బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గల్లంతైన మిగిలిన ముగ్గురు పిల్లల మృతదేహాలను వెలికితీసేందుకు ఎస్డీఆర్ఎఫ్ (SDRF) బృందం నదిలో గాలింపు చర్యలను కొనసాగిస్తోంది. తల్లిదండ్రులు తమ పిల్లలను నదీ తీరాలకు దూరంగా ఉంచాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. కేవలం ఒక్క బైసీ ఉపవిభాగంలోనే ప్రతి సంవత్సరం సుమారు 70 నుండి 80 మంది పిల్లలు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోతుండటం ఇక్కడి భయానక పరిస్థితికి అద్దం పడుతుంది. పసి ప్రాణాలు నది పాలవుతున్నా యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకోకపోవడంపై స్థానికంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

