ఏపీ బీఆర్ అంబేడ్కర్(Breaking News) కోనసీమ జిల్లా ద్రాక్షారామం పుణ్యక్షేత్రంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనకు పాల్పడింది తోటపేట ప్రాంతానికి చెందిన శీలం శ్రీనివాసరావు అని పోలీసులు వెల్లడించారు.

ఆలయ పరిసరాల్లో డ్రైనేజీ సమస్యపై ఆలయ సిబ్బందితో అతడికి కొంతకాలంగా వివాదాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఆలయ సిబ్బందిని ఇబ్బంది(Breaking News) పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనకు మతపరమైన కోణం లేదని, నిందితుడు హిందువేనని ఎస్పీ రాహుల్ మీనా స్పష్టం చేశారు. అతని శరీరంపై టాటూలు ఉన్నాయని, ఘటనలో ఉపయోగించిన పరికరాలు, స్కూటీ, ధరించిన దుస్తులను సీజ్ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం నిందితుడిని విచారిస్తున్నామని చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com

