Girish Bharadwaj: భారతదేశ గ్రామీణ ప్రాంతాల్లో రవాణా విప్లవానికి నాంది పలికి, 'బ్రిడ్జ్ మ్యాన్ ఆఫ్ ఇండియా' (Bridge Man of India) గా ప్రజల గుండెల్లో నిలిచిన పద్మశ్రీ పురస్కార గ్రహీత గిరీశ్ భరద్వాజ్ (76) కన్నుమూశారు.
గత కొంతకాలంగా హృదయ సంబంధిత (గుండె) సమస్యలతో బాధపడుతున్న ఆయన, కర్ణాటకలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల దేశవ్యాప్తంగా ప్రముఖులు, గ్రామీణ ప్రజలు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Read Also:R G Kar Medical College : ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ను మరో 4 నెలల పాటు పొడిగింపు
సామాన్యుడి సేవలో ‘బ్రిడ్జ్ మ్యాన్’
కర్ణాటకకు చెందిన గిరీశ్ భరద్వాజ్ వృత్తిరిత్యా మెకానికల్ ఇంజనీర్ అయినప్పటికీ, గ్రామీణ భారతదేశాన్ని అనుసంధానించేందుకు తన జీవితాన్ని అంకితం చేశారు. ప్రభుత్వాలు కోట్ల రూపాయలు ఖర్చు చేసినా సాధ్యం కాని మారుమూల పల్లెల్లో.. అత్యంత తక్కువ ఖర్చుతో, స్థానిక వనరులను ఉపయోగించి దాదాపు 140కి పైగా ఉరితాడు వంతెనలను (Suspension Bridges) నిర్మించారు. కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లోని నదులు, వాగులపై ఆయన నిర్మించిన వంతెనలు.. నాడు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన వేలాది మారుమూల గ్రామాలకు రవాణా సౌకర్యాన్ని కల్పించాయి. గిరిజన, గ్రామీణ ప్రజల విద్యా, వైద్య అవసరాలకు ఇవి లైఫ్ లైన్లుగా మారాయి.

Girish Bharadwaj: పద్మశ్రీ పురస్కారంతో గౌరవం
ఎలాంటి లాభాపేక్ష లేకుండా, ఇంజనీరింగ్ అద్భుతాలతో గ్రామీణాభివృద్ధికి ఆయన చేసిన అసమాన కృషిని భారత ప్రభుత్వం గుర్తించింది. దేశంలోనే నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మశ్రీ’ అవార్డుతో ఆయన్ను గౌరవించింది. ప్రభుత్వాలపై ఆధారపడకుండా కేవలం ప్రజా భాగస్వామ్యంతో వంతెనలను నిర్మించవచ్చని నిరూపించిన ఆయన జీవన ప్రస్థానం ఎందరికో ఆదర్శప్రాయం. ఆయన మరణం గ్రామీణ భారతదేశానికి తీరని లోటు.
Epaper: epaper.vaartha.com
సీఎం విజయ్, మంత్రి ఆదవ్ అర్జునలకు మద్రాస్ హైకోర్టు నోటీసులు!

