Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు భారత్ కు రానున్న ఇరాన్ మంత్రి అరాఘ్చి

బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు భారత్ కు రానున్న ఇరాన్ మంత్రి అరాఘ్చి

వార్త 2 weeks ago

Iran Foreign Minister India Visit: ఈనెల 14-15 తేదీలలో న్యూఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చి భారత్ కు రానున్నట్లు ఏఎన్ ఐ వార్తా సంస్థ తెలిపింది.

భారత అధ్యక్షతన జరగనున్న రెండురోజుల సమావేశానికి పలుదేశాలకు చెందిన నేతలు రానున్నారు. 2024లో ఈజిప్ట్, ఇథియోపియా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లతో పాటు ఇరాన్ కూడా ఈ కూటమిలో
చేరిన విషయం తెలిసిందే.

Read Also:Netanyahu Warning Iran: యురేనియం నిల్వలను తొలగిస్తే.. ఇరాన్ తో యుద్ధం ముగింపు

 BRICS Summit 2026

Iran Foreign Minister India Visit:రష్యా నుంచి సెర్గీ లావ్రోవ్ రానున్నారు

ఈ బ్రిక్స్ చర్చల్లో పాల్గొనేందుకు ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ గరీబాబాది కూడా పాల్గొనే
అవకాశం ఉందని ఇరాన్ తెలిపింది. రష్యా తరపున సెర్గీ లావ్రోవ్ ప్రాతినిధ్యం వహించనున్నారు.
ఇదిలా ఉండగా, ప్రస్తుత ప్రాంతీయ పరిణామాలపై అభిప్రాయాలను పంచుకోవడానికి, ఏప్రిల్ 23-24
జాతీయ రాజధానిలో బ్రిక్స్ ఉప విదేశాంగ మంత్రులు, మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా ప్రత్యేక
రాయబారుల (బ్రిక్స్ మెనా) సమావేశం జరిగింది. బ్రిక్స్ ప్రపంచంలోని పదకొండు ప్రధాన వర్ధమాన
మార్కెట్లు, అభివృద్ధి చెందుతున్న దేశాలను ఒకచోట చేర్చుతుంది. బ్రెజిల్, చైనా, ఈజిప్ట్,
ఇథియోపియా, భారతదేశం, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్
అరబ్ ఎమిరేట్స్ భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha