CM Nellore Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 19, 20 తేదీల్లో రాష్ట్రంలోని రెండు కీలక జిల్లాల్లో పర్యటించేందుకు అధికారిక షెడ్యూల్ ఖరారైంది.
మొదటగా ఈ నెల 19వ తేదీన నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంట గ్రామానికి సీఎం చేరుకుంటారు. అక్కడ సముద్రతీర ప్రాంత మత్స్యకారుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం తలపెట్టిన 'మత్స్యకార సేవా' ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని, మత్స్యకార సమాజానికి చేకూరే వివిధ సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.

CM Nellore Tour
అనంతరం, మరుసటి రోజు అనగా 20వ తేదీన ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించనున్నారు. కుప్పం ప్రజల ఆరాధ్యదైవమైన ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవస్థానాన్ని సీఎం దర్శించుకోనున్నారు. ఆలయ సాంప్రదాయాల ప్రకారం గంగమ్మ తల్లికి ముఖ్యమంత్రి హోదాలో పట్టువస్త్రాలు సమర్పించి, రాష్ట్ర ప్రజల శ్రేయస్సును కాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని ఆయా జిల్లాల కలెక్టర్లు, పోలీస్ ఉన్నతాధికారులు ప్రోటోకాల్ మరియు భద్రతాపరమైన ఏర్పాట్లను పకడ్బందీగా పర్యవేక్షిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

